Andhra Pradesh

News May 26, 2024

VIDEO: అనంత ఎస్పీని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

image

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌతమి శాలిని ఆదివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ఎస్పీతో చర్చించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి గానీ, అతని అనుచరులకు గానీ అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదని, వారిపై కేసులు పెట్టవద్దని ఎస్పీని కోరారు. వెంకట్రామిరెడ్డి కేవలం తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు.

News May 26, 2024

విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం వ్యాఖ్యలపై మీ కామెంట్?

image

మరో 8 రోజుల్లో APకి కాబోయే CM ఎవరో తేలిపోనుంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని YCP నాయకులు డేట్, టైం ఫిక్స్ చేశారు. అటు TDP నాయకులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. దీంతో జూన్ 8,9 తేదీల్లో విశాఖలోని హోటల్ రూములన్నీ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఏపీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని మీరు భావిస్తున్నారు.

News May 26, 2024

మాచర్ల: మహిళపై విచక్షణారహితంగా కత్తితో దాడి

image

మాచర్ల పట్టణంలో మహిళపై ఆదివారం ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. 22వ వార్డుకు చెందిన నీలావతి అనే మహిళపై వెంకటేశ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడని బాధితురాలి బంధువులు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం నుంచి వీధుల్లో కత్తితో వీరంగం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

News May 26, 2024

శ్రీకాకుళం: టికెట్ల రూపంలో రూ.9,06,700

image

అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆదివారం ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారికి టికెట్ల రూపంలో రూ.9,06,700, పూజలు, విరాళాల రూపంలో రూ.83,523, ప్రసాదాల ద్వారా రూ.3,82,840 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

News May 26, 2024

జిల్లా కలెక్టర్ పై మండిపడ్డ మంత్రి కాకాణి

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్‌లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు గాని, ఎన్నికల అధికారులకు గానీ కనీసం వసతులు కల్పించలేదన్నారు.

News May 26, 2024

విశాఖలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 

image

విశాఖ నగరంలో శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు పలుచోట్ల విస్తృతంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్వయంగా పర్యవేక్షించారు. జోన్-1 పరిధిలో ఫోర్ వీలర్స్-17, టూ వీలర్స్-148, ఆటోలు-17, జోన్-2 పరిధిలో టూ వీలర్స్-175, ఆటోలు-10, ఫోర్ వీలర్స్-14, ఒక కమర్షియల్ వాహనంపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 26, 2024

కాకినాడ: టీడీపీ నేత మృతి

image

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత గోలి వెంకటరావు ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఈయనది సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేశారు. వెంకట్రావు కుమారుడు గోలి శ్రీరామ్ గ్రామ ఉపసర్పంచ్‌గా కొనసాగుతున్నారు.

News May 26, 2024

శ్రీశైలం వద్ద సమాధిని ఢీకొట్టిన కారు

image

శ్రీశైలం సమీపంలోని రామయ్య మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలానికి వస్తున్న రెండు కార్లు స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పాయి. దీంతో ఒక వాహనాన్ని మరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సమాధిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News May 26, 2024

కడప: అదుపు తప్పి బోల్తా పడ్డ ఆటో

image

పెండ్లిమర్రి మండల పరిధిలోని చీమలపెంట వద్ద వేంపల్లి నుంచి కడప వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసులు, మశయ్య, సుబ్బమ్మ చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. వీరంతా రంపతాడు గ్రామ స్థానికులు వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో ఆటో ముందుభాగం పూర్తిగా దెబ్బతింది.

News May 26, 2024

UPDATE: గుత్తి రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

గుత్తి మండలం ఎంగిలిబండ సమీపంలో ఆదివారం ఉదయం బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన రంజిత్ కుమార్(19) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తొండపాడుకు చెందిన రంజిత్ కుమార్, కళ్యాణ్, హరిబాబు బైక్‌లో గుత్తికి వెళ్తుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రంజిత్ కుమార్‌ను కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.