Andhra Pradesh

News May 26, 2024

శ్రీకాకుళం కలెక్టర్‌కు అచ్చెన్నాయుడు లేఖ

image

జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనుల నిమిత్తం రైతులకు సాగునీరు, వంశధార కాలువల మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టు రైతులకు ఖరీఫ్ కాలానికి సాగునీరు అందించాలని కలెక్టర్‌కు టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆదివారం లేఖ రాశారు. జిల్లాలో రూ.2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వంశధార కాలువల వ్యవస్థ దీనస్థితిలో ఉందని పేర్కొన్నారు. శివారు ప్రాంతాలకు సాగునీరు, వంశధార కాలువల మరమ్మతు చేయాలని కోరారు.

News May 26, 2024

చిత్తూరు: సహకార ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలు చేయాలన్న హైకోర్టు తీర్పుతో జిల్లాలోని 76 సహకార సంఘాల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచింది. దీన్ని సహకార సంస్థలకు వర్తింపజేయలేదు. ఈ మేరకు సహకార ఉద్యోగులకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.

News May 26, 2024

జమ్మలమడుగు: యాచకుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

image

ముద్దనూరు రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇద్దరు యాచకులు మద్యం మత్తులో గొడపడ్డారు. ఈ క్రమంలో ఒకరు బండరాయితో దాడిచేయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి ముద్దనూరు సివిల్ పోలీసులు, ఎర్రగుంట్ల రైల్వే సీఐ చేరుకొని దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 26, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ రోజు ఏజెంట్లు.. ఇవి మర్చిపోవద్దు

image

ఎలక్షన్-2024 ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి 6 AM లోపు చేరుకోవాలి. ఫాం 18పై ROతో సంతకం చేయించి తీసుకెళ్లాలి. వారు ఇచ్చే ID, ఆధార్, ఫాం 17C తో పాటు ఓట్లు లెక్కించుకునేందుకు బుక్లెట్, పెన్ను తీసుకోవాలి. సెల్‌ఫోన్‌లను అనుమతించరు. ఒకసారి లోపలికి వెళితే బయటికి రానివ్వరు. మీ బ్యాడ్జీపై మీకు కేటాయించిన టేబుల్ వివరాలుంటాయి. అక్కడ నుంచి వేరే చోటుకు వెళ్లరాదు.

News May 26, 2024

నార్పల: రైతుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

నార్పల మండలం జంగమరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో రైతుల మధ్య ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందారు. అతడు ఇటీవల నూతన బోరు వేయించాడు. మోటార్ ఆమర్చడానికి వెళ్లిన సమయంలో తుంపెర గ్రామస్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కిందపడగా వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News May 26, 2024

శ్రీకాకుళం: ర్యాంకుల వారీగా పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన

image

జిల్లాలో రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్లను పరిశీలించనున్నారు. మే 27 తేదీన 1 నుంచి 12 వేల లోపు, 28 తేదీన 12,001 నుంచి 27 వేల లోపు, 29 తేదీన 27,001 నుంచి 43 వేలు లోపు, 30 తేదీన 43,001 నుంచి 59 వేల లోపు, 31 తేదీన 59,001 నుంచి 75 వేలు, జూన్‌ 1 తేదీన 75,001 నుంచి 92,000 వరకు, 2 తేదీన 92,001 నుంచి 1,08,000 వరకు, జూన్ 3 తేదీన 1,08,001 నుంచి చివరి ర్యాంకు వచ్చిన అభ్యర్థులు పరిశీలనకు హాజరుకావాలి.

News May 26, 2024

విశాఖ: ఏయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు చెందిన ఆరో సెమిస్టర్ ఫలితాలు వెలువడ్డాయి. 27,603 మంది విద్యార్థులు ఆరో సెమిస్టర్‌కు హాజరు కాగా 27,483 మంది ఉత్తీర్ణులైనట్లు ఏయూ డిగ్రీ కళాశాల ఎగ్జామినేషన్ డీన్ ఆచార్య డీవీఆర్ మూర్తి తెలిపారు. 99.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏయూ వెబ్ సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.

News May 26, 2024

చీరాల: రైలు ప్రమాదం.. రెండు చేతులు కోల్పోయిన యువకుడు

image

చీరాల పట్టణ పరిధిలో పేరాలకు చెందిన వడ్డె నాగేశ్వరరావు బజారుకు చెందిన ఈశ్వరరావు తన రెండు చేతులు పోగొట్టుకున్నాడు. ర్వైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజాము సమయంలో కారంచేడు రైలు గేటు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను రెండు చేతులు కోల్పోయాడు. స్థానికులు 108లో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 26, 2024

వాకాడులో రోడ్డు ప్రమాదం

image

వాకాడు మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిరెడ్డిపాలెం వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News May 26, 2024

శ్రీకాకుళం: ఏయూ డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డివిఆర్ మూర్తి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ డిగ్రీ 6 సెమిస్టర్ పరీక్షల మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవ్వగా 27,483 మంది ఉత్తీర్ణత సాధించారని 99.57 శాతం ఉత్తీర్ణత నమోదైందని అన్నారు.