Andhra Pradesh

News May 26, 2024

ప్రకాశం: అర్ధరాత్రి కత్తితో యువకుడు వీరంగం

image

అర్ధరాత్రి ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల పెద్ద నాగేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తి చేతబట్టి నలుగురిపై దాడి చేశాడు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 26, 2024

నంద్యాల: భార్యను అతికిరాతకంగా చంపిన భర్త

image

నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే సుగుణమ్మ(54) ఇంటి ముందు మంచంపై నిద్రిస్తుండగా భర్త అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. మద్యం మత్తులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. సీఐ గోపీనాథ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 26, 2024

టెక్కలి: పదో తరగతి పరీక్షల్లో అనూహ్య పరిణామం

image

టెక్కలిలో జరుగుతున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక బాలికోన్నత పాఠశాలలో జరిగిన హిందీ పరీక్షకు టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, మెలియాపుట్టి మండలాల నుంచి 57 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 52 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో 5మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించగా ఒక్కోక్కరికి ఒక్కో రూమ్ కేటాయించారు. వీరి కోసం మొత్తం 9 మంది విధులు నిర్వహించారు.

News May 26, 2024

తూ.గో: ముగ్గురికి పరీక్ష.. విధుల్లో 20 మంది

image

‘పది’ సప్లిమెంటరీ హిందీ పరీక్షలో భాగంగా శనివారం తూ.గో జిల్లా కొవ్వూరు పరిధిలో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 3 పరీక్షా కేంద్రాలకు 80 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ముగ్గురు మాత్రమే వచ్చారు. PMMM స్కూల్‌లో 25 మందికి గానూ 1, ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో 31 మందికి 1, బాలికోన్నత పాఠశాలలో 24 మందికి ఒకరు పరీక్ష రాశారు. ఈ ముగ్గురి కోసం 20 మంది టీచర్లు విధులు నిర్వహించారు.

News May 26, 2024

కృష్ణా: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు

image

బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పింటెక్ క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కూలీలు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట వండుతుండగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దేవరాజ్ (2), వనిత (30), సాయినాధ్ (27), లక్ష్మీబాయి (20)లకు తీవ్ర గాయాలవ్వగా.. నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.

News May 26, 2024

రేణిగుంట-కడప రహదారిపై వ్యక్తి మృతి

image

రేణిగుంట-కడప జాతీయ రహదారిలోని చెంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రైలు నుంచి జారి పడిపోయాడా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 26, 2024

నెల్లూరు: డాక్టర్లకు షోకాజ్ నోటీసులు సిద్ధం

image

జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు డాక్టర్లకు షోకాజ్ నోటీసుల జారీకి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. నెల్లూరులో 20, కావలిలో నాలుగు, కందుకూరులో రెండు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున మొత్తం 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న కారణంతో డిఎంహెచ్వో పెంచలయ్య నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

News May 26, 2024

కర్నూలు: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

పని ప్రదేశంలో ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. హాలహర్వి మండలం ఎంకేపల్లిలో లసమన్న అనే ఉపాధి కూలీ పనికి వెళ్లి పని ప్రదేశంలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి కూలీలు సపర్యలు చేస్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏపీఓ హేమ సుందర్ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5 వేలు సాయం అందించి వివరాలను జిల్లా అధికారులకు విన్నవించారు.

News May 26, 2024

మార్కాపురం: ‘నా కోరిక తీర్చు.. నీ డిప్యూటేషన్ రద్దు చేయించను’

image

డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఉద్యోగినిపై ఓ అధికారి కీచకుడిగా మారారు. ‘నీ డిప్యూటేషన్ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలో నా స్నేహితుడికి లాడ్జి ఉంది. లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరకుంటే కంభం వచ్చినా సరే.. రాకుంటే నీ డిప్యుటేషన్ రద్దు చేయిస్తా’ ఇవి ఓ కామాంధ అధికారి మాటలు. ఈ మాటలు విన్న ఆ ఉద్యోగి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులకు శనివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

News May 26, 2024

కడప జిల్లాలో క్రాస్ ఓటింగ్ గుబులు

image

కడప జిల్లాలో ఓటింగ్ శాతం పెరగింది. దీంతో పాటు క్రాస్ ఓటింగ్ కూడా పడిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీ ఎన్నికలో షర్మిల ప్రభావం చూపినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చాయి. ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీకి, ఎంపీ ఓటు ఇంకోపార్టీకి వేసినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఇది ఎవరికి మేలు, ఎవరికి కీడు జరిగిందో తెలుసుకోవాలంటే మరో వారం రోజులు వేచిచూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.