Andhra Pradesh

News May 25, 2024

సత్యసాయి జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం 43,988 మంది నమోదు

image

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసే రైతులకు అందించే రాయితీ విత్తనాలకు 43,988 మంది పేర్లను నమోదు చేసుకున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు తెలిపారు. రైతులకు పంపిణీ చేసేందుకు విత్తనాలను ఆర్బీకేల్లో సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 43,988 మంది రైతులకు అనుగుణంగా 37,419 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని తెలిపారు.

News May 25, 2024

నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

image

సింహాచలం ఆలయంలో వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠిపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 25, 2024

చీరాలలో రైలు కింద పడి వ్యక్తి మృతి

image

చీరాల పట్టణ సమీపంలోని విజయనగర కాలనీ సమీపంలో తేళ్ల బుల్లయ్య (35) అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

News May 25, 2024

తూ.గో: రోహిణి కార్తె.. సాగు పనులు ప్రారంభం

image

రోహిణి కార్తె ఆగమనం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఓ వైపు ఎండలకు భయపడుతూనే.. వానాకాలం దగ్గర పడిందంటూ సాగుకు సమాయత్తం అవుతున్నారు. సంబరంగా పనులు మొదలు పెట్టారు. రోహిణి కార్తె అనగానే రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని నానుడి. దీంతో పాటు తుపాన్ భయాలు ఉంటాయి. అయితే ప్రకృతి ధర్మాన్ని రైతన్న గౌరవిస్తూనే తనవంతు ధర్మం పాటిస్తూ హలం పట్టాడు. ఉభయ గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఖరీఫ్ సందడి కనబడుతోంది.

News May 25, 2024

గుంటూరు: పొలాల్లో యువతి మృతదేహం కలకలం

image

గుంటూరు సమీపంలోని పొలాల్లో ఒక యువతి దేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని పెదకాకాని వద్ద పొలాల్లో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె నోటి వెంట నురగతో పాటు రక్తం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 25, 2024

ప.గో జిల్లాలో 187.8 మిల్లీమీటర్ల వర్షపాతం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24 గంటల వ్యవధిలో 187.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఆచంట మండలంలో 40 మిల్లీమీటర్లు, ఇరగవరం మండలంలో 35.6, పాలకొల్లు మండలంలో 29.2, పోడూరు మండలంలో 20.2, పెనుగొండ మండలంలో 19.2, నరసాపురం మండలంలో 17.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వివరించారు.

News May 25, 2024

అస్వస్థతకు గురై తుని రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపై ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు జీఆర్పీ SI అబ్దుల్ మారుఫ్ తెలిపారు. విశాఖలోని కృష్ణ మార్కెట్ ప్రాంతంలో బంగారం పనిచేసే మధుపాక భాస్కర్‌రావు(45)గా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖ నుంచి బ్రహ్మంగారి మఠానికి ట్రైన్‌లో వెళ్తుండగా.. తుని రైల్వే స్టేషన్‌లో దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ఎస్సై తెలిపారు.

News May 25, 2024

మదనపల్లె: శేషాద్రి హత్యకు ఆధిపత్య గొడవలే కారణమా..?

image

మదనపల్లెలో శనివారం వేకువ జామున రామారావుకాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే ఓ ముఠా ఈ ఘాతుకానిక పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆధిపత్య పోరులో భగంగా ముఠాలోని సుమారు 30 మంది ప్రత్యర్థులు శేషాద్రిని కత్తులు, వేట కొడవళ్లతో 70సార్లు అతికిరాతకంగా నరికి హతమార్చారు. పోలీసులు కత్తిపోట్లు చూసి విస్తుపోయారు.

News May 25, 2024

ప.గో: ALERT.. చలామణిలో భారీగా నకిలీ నోట్లు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఆయా పార్టీల తరఫున ఓటర్లకు తాయిలాలు అందాయి. నేతలు పంపిణీ చేసిన నగదులో రూ.500, రూ.200 నోట్లు ఎక్కువగా ఉండగా, అందులో చాలావరకు నకిలీవి ఉన్నట్లు సమాచారం. కొనుగోళ్ల ద్వారా ఇవి మార్కెట్‌లోకి వస్తుండటంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గెలుపోటములపై జరుగుతున్న బెట్టింగ్స్‌లోనూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.

News May 25, 2024

నంద్యాల: నెల రోజులపాటు ఈ రెండు రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ పనుల మరమ్మతుల పనుల కారణంగా రైళ్ల రద్దు మరికొంత కాలం పొడిగిస్తూ రైల్వే ఉన్నాతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని డోన్ రైల్వేస్టేషన్ మేనేజర్ జి.వేంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు నుంచి డోన్(17228) రైలు, హుబ్బళ్లి నుంచి విజయవాడు(17329) జూన్ 30వ తేదీవరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వే వారికి సహకరించాలని కోరారు.