Andhra Pradesh

News September 24, 2024

అమెరికా పర్యటనకు మంత్రి కొండపల్లి

image

అమెరికా పర్యటనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. అమెరికాలో 10 రోజుల పాటు పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ మహిళల అభ్యున్నతికి పెట్టుబడులు తెచ్చే నిమిత్తం అక్కడి ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అమెరికా పర్యటన అనంతరం అక్టోబర్ 3న జిల్లా కు ఆయన రానున్నారు.

News September 24, 2024

డల్లాస్‌లో కానూరు యువకుడు గుండెపోటుతో మృతి

image

పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీరాఘవ హార్ట్ అటాక్‌తో అమెరికాలోని డల్లాస్‌లో మృతిచెందాడు. మృతుడు ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మంగళవారం అతని మృతదేహం స్వగ్రామం కానూరు రానున్నట్లు పేర్కొన్నారు.

News September 24, 2024

ఉత్తరాంధ్ర రైల్వే డివిజన్ ఛైర్మన్‌గా కేంద్రమంత్రి

image

విశాఖపట్నంలో జరిగిన రైల్వే వాల్తేర్ డీఆర్ఎం సమావేశంలో ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధి పనులపై చర్చించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం-సికింద్రాబాద్ తిరుపతికి కొత్త రైళ్లను, రోజువారి ప్రయాణికుల కోసం శ్రీకాకుళం-విశాఖను కలిపే నమో-భారత్ సర్వీసును ప్రారంభించాలని అధికారులను కేంద్రమంత్రి కోరారు. డివిజన్ ఛైర్మన్‌గా ఎంపిక చేసినందకుకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 24, 2024

గుజరాత్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన

image

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన హై లెవెల్ కమిటీ సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆ రాష్ట్రంలో పీపీపీ విధానంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి, ఇతర అనేక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. నిన్న ఆ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లతో అహ్మదాబాద్‌లో సమావేశమై చర్చించారు.

News September 24, 2024

శ్రీకాకుళం: బాణసంచా విక్రయాలపై అనుమతులు తప్పనిసరి

image

దీపావళి పండుగ నేపద్యంలో బాణసంచా పేలుళ్లు జరగకుండా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాలు తయారీకి అనుమతులు ఉన్న గోడౌన్లు, షాపులు వద్ద భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు పరిశీలించాలన్నారు. అనంతరం ఇతర శాఖల అధికారులతో జాయింట్ తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News September 24, 2024

పిఠాపురం: విద్యార్థినికి డిప్యూటీ సీఎం ఆర్థిక సాయం

image

పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ పొందారు. ఆర్థిక సమస్యలు కారణంగా కాలేజీలో చేరేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి నాయకులు తీసుకువచ్చారు. తక్షణం స్పందించి రూ.4.లక్షలు ఆర్థిక సహాయం చేశారు. మంగళగిరి కార్యాలయంలో విద్యార్థిని జగదీశ్వరి, ఆమె తండ్రికి పవన్ చెక్కును అందజేశారు.

News September 24, 2024

ఏలూరు: భార్యాభర్తలకు జీవిత ఖైదు

image

పెదపాడు మండలానికి చెందిన భార్యాభర్తలకు సోమవారం జీవితఖైదు శిక్ష పడిందని ఏలూరు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ పీపీ రామాంజనేయులు తెలిపారు. విజయలక్ష్మికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, భర్త మృతితో మేనమామ సతీశ్‌ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఆ ఇద్దరిపై సతీశ్ అత్యాచారం చేయగా 2023లో కేసు నమోదయిందన్నారు. నిందితుడికి తల్లి విజయలక్ష్మి కూడా సహకరించిందని నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.

News September 24, 2024

శ్రీ చైతన్య ఘటనపై నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్

image

మధురవాడ పరిధిలో మారికవలసలో గల శ్రీ చైతన్య కళాశాల హాస్టల్లో కనీస సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థులు చేసిన ఆర్తనాదాలపై ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై తక్షణం నివేదిక అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అన్నారు.

News September 24, 2024

ఎన్టీఆర్ జిల్లాలో వరదలు.. బీమా క్లెయిమ్‌లపై కలెక్టర్ ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లాలో వరదలతో ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. ఈ క్రమంలో దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలకు సంబంధించి 49.17శాతం క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన సోమవారం తెలిపారు. మొత్తంగా 11,046 క్లెయిమ్‌లు రిజిస్టర్‌ కాగా.. 5,399 సెటిల్‌ చేసినట్టు చెప్పారు. 2,145 రుణ ఖాతాలకు 164.95 కోట్లు రీ షెడ్యూల్‌ చేసినట్టు కలెక్టర్ తెలిపారు.

News September 24, 2024

విశాఖ: రెవెన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా రెవిన్యూ శాఖలో పలు క్యాడర్లలో బదిలీలు జరిగాయి. 40 మంది డిప్యూటీ తహశీల్దారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో అల్లూరి జిల్లాకు ఆరుగురు, అనకాపల్లి జిల్లాకు ఆరుగురిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లాలో 28 మంది డీటీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు 14 మంది జూనియర్ అసిస్టెంట్లు, 55 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశారు.