India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన ఇద్దరు మెడికల్ విద్యార్థులు ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కొసిరెడ్డి సౌమ్య మృతదేహం బొబ్బిలి పట్టణానికి సోమవారం రాత్రి చేరుకుంది. సౌమ్య మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 243 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. భారీ ఎత్తున పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగగా, బదిలీ అయిన వారు త్వరలో వారికి కేటాయించిన స్థానాలలో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
పెళ్లికి పిలవలేదని అడిగిన స్నేహితుడిని చితక్కొట్టిన ఘటనపై నగరంపాలెం పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. వికలాంగుల కాలనీకి చెందిన సాయికుమార్కు అదే ప్రాంతానికి చెందిన నాగరాజు స్నేహితుడు. కొద్దిరోజుల క్రితం నాగరాజు వివాహమైంది. తనను పెళ్లికి పిలవలేదని సాయికుమార్ ప్రశ్నించారు. బంధువులందరి ముందు అడుగుతావా అంటూ గొడవ పెట్టుకున్న నాగరాజు కర్రతో కొట్టాడని సాయి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నరసింహారెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం జిల్లాలో జరిగిన రెవెన్యూ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అతనికి ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి వీఆర్వో గా పోస్టింగ్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో మృతి ఉన్నతాధికారులకు తెలియకపోవడంతోనే ఇలా జరిగి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.
వ్యభిచారం చేస్తున్న పదిమందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఓ లాడ్జీలో వ్యభిచారం చేస్తున్న ఏడుగురు విటులు, ఇద్దరు మహిళా బాధితులతో పాటు నిర్వాహకురాలు రజియా బేగంను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధిత మహిళలను వారి తల్లిదండ్రులకు అప్పగించి, తిరిగి ఈ వృత్తిలోకి రాకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు.
గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి అండర్-17 పుట్బాల్ పోటీలకు ఎస్.రాయవరం జడ్పీ పాఠశాలకు చెందిన 5 గురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయిలో ఈ నెల 19న జరిగిన జిల్లా స్థాయి సెలెక్షన్స్లో ఎస్.రాయవరం విద్యార్థినులు కావ్య, భార్గవి, వాహిని, వైష్ణవి, వర్షిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనలో మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ సూచించారు. సోమవారం ఆయన ఈపీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరితగతిన అండర్ గ్రౌండ్ సిస్టం పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు ఎండార్స్ చేశారు. చట్ట పరిధిలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేర నిర్మూలనలో జిల్లా పోలీసులు సమర్దవంతంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి అభినందించారు. సోమవారం పోలీసుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో సాధించిందన్నారు. అంతేకాకుండా ముత్తుకూరు పరిధిలో జరిగిన దోపిడీ కేసును గంటల వ్యవధిలో చేధించడంలో అద్భుతంగా పనిచేశారన్నారు.
శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రభుత్వ పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.