Andhra Pradesh

News May 23, 2024

పోస్టల్ బ్యాలెట్లన్నీ సురక్షితంగా ఉన్నాయి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లన్నీ జిల్లా ట్రెజరీలో భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన జిల్లా ట్రెజరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటితో పాటు డబల్ లాక్ సిస్టం కూడా ఉందని పేర్కొన్నారు. 24 గంటలూ ఆర్మ్‌డ్ గార్డ్ పర్యవేక్షణ ఉందన్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

బీఈడీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

News May 23, 2024

REWIND: ఎచ్చెర్లలో అత్యధికం, ఆముదాలవలసలో అత్యల్పం

image

2019 ఎన్నికలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎచ్చెర్లలో “NOTA”కు అత్యధిక ఓట్లు పడగా, ఆముదాలవలసలో అత్యల్ప ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఎచ్చెర్ల స్థానంలో “NOTA”ను 4,628 మంది ఎంచుకోగా, ఆముదాలవలస స్థానంలో 2,656 మంది “NOTA”కు ఓటేశారు. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో “NOTA” ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో జూన్ 4న తెలియనుంది.

News May 23, 2024

ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇలా

image

ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలులోని రైజ్ కాలేజీలో జిల్లాలోని 8 నియోజకవర్గాలకు విడివిడిగా గదులు కేటాయించారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన గదిలో 28 టేబుళ్లు ఉంటాయి. 14 టేబుళ్లు అసెంబ్లీ, 14 టేబుళ్లు పార్లమెంట్ సెగ్మెంట్కు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 4 టేబుళ్లు అసెంబ్లీకి, 4 టేబుళ్లు పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఏర్పాటు చేస్తున్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం: పీజీ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు

image

విజయనగరంలోని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ అందించే పలు పీజీ కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ మేరకు ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్శిటీ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్లకై https://ctuapcuet.samarth.edu.in/pg/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సెంట్రల్ వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

News May 23, 2024

తూ.గో.: స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ వాయిదా

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డాక్టర్.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 24, 25వ తేదీల్లో జరగాల్సిన స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామని జిల్లా సమన్వయ అధికారి వెంకట్రావు గురువారం తెలిపారు. తదుపరి తేదీలను పత్రికా ముఖంగా తెలియజేస్తామన్నారు. పేరెంట్స్, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు.

News May 23, 2024

స్ట్రాంగ్ రూములను అభ్యర్థులు, ఏజెంట్లు పరిశీలించవచ్చు: ఎన్నికల అధికారి

image

కంట్రోల్ రూంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు, వారి ఏజెంట్లు పరిశీలించవచ్చని ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు అనుమతి లేదన్నారు.

News May 23, 2024

కృష్ణా: ఓట్ల లెక్కింపుపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ

image

జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపుకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లకు కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ వాణి, శిక్షణా తరగతుల నోడల్ ఆఫీసర్ మురళీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

News May 23, 2024

తాడిపత్రిని అష్టదిగ్బంధనం చేస్తున్న పోలీసులు

image

తాడిపత్రి పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డీఐజీ షిమోన్షి, ఎస్పీ గౌతమి శాలి పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల వద్ద క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఎన్నికల పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. వచ్చే నెల 4న వెలువడనున్న ఫలితాల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

News May 23, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన సంపంగి రవిశేఖర్ ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అయితే కోలుకోలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.