India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 24 నుంచి జూన్ 3వ తేది వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డిఈఓ బి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 45 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఉదయం 9: 30 గంటల నుంచి 12:45 గంటల వరకు జరిగే పరీక్షలకు 13,332మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇచ్చాపురం మండలం డోంకూరులో బుధవారం అర్ధరాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ఉష(30) కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతుంది. బుధవారం తీవ్రమైన తలనొప్పి రాగా, భరించలేక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వాసుపల్లి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు నందన(10), రిత్విక్(5) సంతానం.
చికెన్ ప్రియులను ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి..చికెన్ ధర అమాంతం పెరిగింది. మనుబోలు మార్కెట్లో బుధవారం చికెన్ ధర ఏకంగా రూ.330 అయింది. దీంతో మాంసం ప్రియులు కడుపు నిండా చికెన్ తినాలంటే జేబులు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీసీవై పార్టీ మద్దతుదారుపై వైసీపీ నాయకులు దాడి చేసినట్టు బాధితురాలు ఆరోపించింది. బర్నేపల్లి గ్రామానికి చెందిన శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ బుధవారం కత్తితో దాడి చేసి గాయపరిచారని ఆమె ఆరోపించింది. ఆమె భర్త శంకర్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో సబ్ జైల్లో ఉన్నారు. సీఐ రాఘవరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు శివారులో యువకుడి డెడ్బాడీ కలకలం రేపింది. కైరం నాగశ్రీనివాస్(34) తన తండ్రి పోతురాజుతో పొలం పనులకు వెళ్తూ ఉంటాడు. గురువారం ఉదయం గ్రామ శివారున శ్రీనివాస్ స్పృహ లేకుండా పడి ఉండడం చూసి తండ్రి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అతడు చనిపోయినట్లు తెలపగా.. తండ్రి పోతురాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.శ్రీనివాస్ తెలిపారు.
అనంత జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకూ నిర్వహిస్తున్నట్లు డీవీఈఓ వెంకటరమణనాయక్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 34 కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. జనరల్ కోర్సుల మొదటి ఏడాది విద్యా ర్థులు 15,921మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5017మంది, వృత్తిపరమైన ప్రథమ సంవత్సరం 980, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 592మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తత్కాల్ కింద గురువారం కూడా చెల్లించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ వెంకటరమణనాయక్ కోరారు. తత్కాల్ కింద రూ.3వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు
తాడిపత్రి మండలంలో రైలు కింద పడి తాడిపత్రి టౌన్ బ్యాంక్ మాజీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాత్రి జరిగింది. పట్టణ పరిధిలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా తాడిపత్రికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన 8 ఏళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 40 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI కుటుంబరావు తెలిపారు. చిన్నారి తినుబండారాలు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్లగా.. దుకాణదారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటికి వచ్చి కుటుంబీకులకు చెప్పగా.. వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై శిరీష బుధవారం తెలిపారు. విశాఖలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన కె.శివాజీ కుమార్ (60)తో పాటు మరో నలుగురు చినకాద శివారు రాజుల పేటలో జరుగుతున్న పండగకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వాష్ రూమ్కి వెళ్లిన కుమార్ ఎంతకీ రాలేదు. దీంతో పరిసర ప్రాంతాలు వెతకగా నేలబావిలో మృతదేహం లభించిందని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.