Andhra Pradesh

News May 23, 2024

నెల్లూరు: ఆదాల, విజయసాయిరెడ్డిపై కంప్లైంట్

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు వైసీపీ నేతలు ఓటరు జాబితాలను చించివేయడంతో పాటు తమను బెదిరించారని టీడీపీ బూత్ ఏజెంట్లు శరవణ, మహేశ్, శివకుమార్, శ్రీనివాసులు, రహీమ్ ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 102, 103 బూతుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, 148వ బూత్ లో విజయసాయిరెడ్డి, 184, 185, 186 బూతుల్లో మొయిళ్ల గౌరీ, సురేష్ రెడ్డి భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News May 23, 2024

చిత్తూరు: నేటి నుంచి ఏనుగుల లెక్కింపు

image

చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం నుంచి ఏనుగుల గణన చేపట్టనున్నారు. చిత్తూరు తూర్పు, పశ్చిమ, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్ల పరిధిలోని బీట్లలో అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం మూడురోజులు కొనసాగనుంది. మొదటిరోజు 15 కి.మీ. అడవిలో ఏనుగుల అడుగుజాడలు, మలమూత్ర విసర్జన ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు.

News May 23, 2024

ఓట్ల లెక్కింపు.. ప.గో జిల్లాలో తొలి ఫలితం ఇదే 

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తొలి ఫలితం నరసాపురం అసెంబ్లీ నుంచి వెలువడనున్నది . నరసాపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 14 టేబుల్స్‌పై కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రౌండ్లలో నరసాపురం, 13 రౌండ్లలో ఆచంట, 14 రౌండ్లలో పాలకొల్లు, 15 రౌండ్లలో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి ఫలితాలు వెల్లడికానున్నాయి. 17వ రౌండ్‌లో భీమవరం ఫలితం వెలువడనుంది.

News May 23, 2024

తిరువూరు: 25 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కేనా..!

image

తిరువూరులో 1999లో చివరిసారిగా టీడీపీ గెలిచింది. అనంతరం 2004,09లో కాంగ్రెస్, 2014,19లో తిరువూరులో వైసీపీ గెలిచింది. తాజా ఎన్నికల్లో కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ నుంచి బరిలో దిగగా, 1999లో చివరిసారిగా టీడీపీ నుంచి గెలిచిన స్వామిదాసు పార్టీ మారి వైసీపీ నుంచి బరిలో నిలిచాడు. ఈసారి తిరువూరులో టీడీపీ జెండా ఎగురుతుందని టీడీపీ శ్రేణులు చెబుతుండగా, వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

News May 23, 2024

తాడిపత్రి ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్.. ఆరుగురికి స్థానచలనం

image

తాడిపత్రి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అలజడులని ముందస్తుగా పసిగట్టడంలో విఫలం, ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడం, ప్రమాదాన్ని గుర్తించడంలో అలసత్వం వహించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు కానిస్టేబుల్స్‌ను స్పెషల్ బ్రాంచ్ పరిధి నుంచి తప్పించారు. ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News May 23, 2024

కుమ్మపల్లి జంక్షన్‌లో టాటా మ్యాజిక్ ఢీకొని వ్యక్తి మృతి

image

వేపాడ మండలంలో కుమ్మపల్లి జంక్షన్ వద్ద కొత్తవలస నుంచి ఆనందపురం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వల్లంపూడి ఎస్సై రాజేశ్ వివరాల మేరకు ఎల్.కోట మండలం పిల్ల అగ్రహారానికి చెందిన గొలగాని అప్పన్న కుమ్మపల్లి జంక్షన్ కోళ్ల ఫారమ్‌లో పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం టాయిలెట్‌కు వెళుతున్న అప్పన్నను టాటా మ్యాజిక్ ఢీకొంది. డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసారు.

News May 23, 2024

కోడుమూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి

image

కోడుమూరు శివారులోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాకు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందగా.. 20మందికి పైగా గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 23, 2024

కడప: ఎన్నికల కౌంటింగ్.. చివరి ఫలితం ఇక్కడే

image

జూన్ 4న జరగనున్న జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌కు ప్రతి నియోజకవర్గంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో 18 రౌండ్లు, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, కడపలో 21 రౌండ్లు, పులివెందులలో 22, జమ్మలమడుగులో 23 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది. దీంతో కమలాపురం ఫలితం మొదటగా, జమ్మలమడుగు ఫలితం చివరగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.

News May 23, 2024

కాకినాడ: పెళ్లికి వెళ్లొస్తూ కాలువలో వ్యక్తి గల్లంతు

image

కాకినాడ జిల్లా రౌతులపూడి శివారులో ఏలేరు ఎడమ కాలువలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన సీకోలు వీరబాబు అదే గ్రామానికి చెందిన పలువురితో కలిసి రౌతులపూడిలో ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఏలూరు ఎడమ కాలువలో స్నానానికి దిగగా.. వీరబాబు గల్లంతయ్యాడని దుర్గాడ గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

News May 23, 2024

నెల్లూరు: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవ దహనం

image

కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వెళుతున్న లారీ.. మేదరమెట్ల పైలాన్ రహదారి పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇనమనమడుగు చెందిన డ్రైవర్ శ్రీధర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఈ లోగా మంటలు చెలరేగి అతను సజీవదహనం అయ్యాడు.