Andhra Pradesh

News September 25, 2025

అర్థవీడు మండలంలో దారుణ ఘటన

image

అర్ధవీడు మండలంలోని గన్నేపల్లిలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ వ్యక్తిని మరో వ్యక్తి కర్రతో దాడి చేసి అతి క్రూరంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 25, 2025

రేపే కంచరపాలెంలో జాబ్ మేళా

image

విశాఖ సిటీ కంచరపాలెంలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా జరగనుంది. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 900కు పైగా ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News September 25, 2025

చీపురి పట్టిన కర్నూలు కలెక్టర్ డా.సిరి

image

కర్నూలులో గురువారం నిర్వహించిన ‘ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పాల్గొన్నారు. తుంగభద్ర నది సమీపంలోని సంకల్ భాగ్ వద్ద చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.

News September 25, 2025

GNT: మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

image

భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ నెల 23వ తేదీ మంగళవారం సాయంత్ర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించడం జరిగిందని జల వనరుల విభాగ అధికారులు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 వరకు బ్యారేజీ నీటి మట్టం 12 అడుగుల కంటే తక్కువగా ఉన్నట్లు చెప్పారు.

News September 25, 2025

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

image

విజయనగరం కలెక్టరేట్‌లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతకు పాటు పడాలని పిలుపునిచ్చారు. రోజుకో ఓ గంట సమయం సేవకు కేటాయించాలని కలెక్టర్ సిబ్బందికి చెప్పారు. కలెక్టర్‌తో పాటు జేసీ సేదుమాధవన్, అధికారులు, నాయకులు, మున్సిపల్ తదితరులు ఉన్నారు.

News September 25, 2025

చివరి దశలో రాజధానిలో తొలి శాశ్వత భవనం

image

రాజధానిలో తొలి శాశ్వత భవనంగా CRDA ప్రధాన కార్యాలయం రికార్డు నెలకొల్పనుంది. కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా అత్యాధునిక డిజైన్, ఇంటీరియర్‌తో రూపుదిద్దుకున్న ఈ జీ+7 భవనం విజయదశమి పండుగ సందర్భంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. రూ.240కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయం, రాయపూడి సమీపాన ఉంది. టెర్రస్‌పై ఫుడ్ కోర్ట్, జిమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలువనుంది.

News September 25, 2025

విశాఖ KGHలో సీబీఐ విచారణ

image

విశాఖ ద్వారకానగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో పశ్చిమబెంగాల్‌కు చెందిన రీతూ సాహు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సీబీఐకి అప్పగించారు. ఈక్రమంలో సీబీఐ అధికారులు గురువారం KGHకు వచ్చారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. కాలేజీ నుంచి ఏ సమయానికి KGHకు తీసుకొచ్చారు? పోస్టుమార్టం రిపోర్ట్, తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు.

News September 25, 2025

మొగల్తూరు: ఆరేళ్ళ బాలికపై అత్యాచారం

image

మొగల్తూరు మండలంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఎస్సై జి.వాసు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో నిన్న ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో బాలికను నిందితుడు కోనాల జాన్ బాబు(55) తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News September 25, 2025

వరల్డ్ క్లాస్ సిటీగా విశాఖ..!

image

విశాఖను ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ తాత్కాలిక ఆఫీస్ ప్రారంభించి శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. కాగ్నిజెంట్, ANSR, సత్వ, యాక్సెంచర్ కూడా పెద్ద క్యాంపస్‌లను ప్రకటించాయి. రాబోయే 5, 10 ఏళ్లలో లక్షలాది ఐటీ ఉద్యోగాలు సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా విశాఖ మారనుంది. దీంతో రియల్ ఎస్టేట్ సైతం పుంజుకునే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.

News September 25, 2025

నెల్లూరులో రేషన్ అక్రమాలకు చర్యలు: మంత్రి

image

నెల్లూరు జిల్లాలో PDS రైస్ అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఒక చెకోపోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని మంత్రి మనోహర్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.234 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వరుసగా పీడీఎస్ రైస్ బయట ప్రాంతాలకు తరలి వెళ్తుండగా అధికారులు సీజ్ చేస్తున్నారు.