India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విలక్షణమైన నటుడు, రచయిత, నాటక ప్రయోక్త పి.ఎల్. నారాయణగా పేరుపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 – నవంబరు 3, 1998) ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఈయన ఎక్కువగా సహాయ పాత్రలు, హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. 1992లో యజ్ఞం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. కుక్క, నేటి భారతం, మయూరి, రేపటి పౌరులు సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ (SEP 10, 1922 – జూన్ 23, 1985) గుంటూరు జిల్లా యలవర్రులో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకొని దేశ ఖ్యాతిని పెంచిన ప్రొఫెసర్ నాయుడమ్మ పలు ప్రతిష్ఠాత్మక హోదాలను అందుకున్నారు. భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్గా పనిచేశారు.1971లో పద్మశ్రీ వరించింది. నేడు ఆయన జయంతి.
నగరంలోని జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్ ఫోర్లో జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనగా అక్రమ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయి. ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు ఏసీపీ ఝాన్సీ లక్ష్మీని అడిగారు. జీవన్సి ఆర్థిక పరిపుష్టి సాధించే ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ పాల్గొన్నారు.
తర్లుపాడు MPDO చక్రపాణి ప్రసాద్పై పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారులు వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంటింజెంట్ వర్కర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చక్రపాణిపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. MPDOపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కమిటీ విచారణ, ప్రాథమిక సాక్ష్యంతో సస్పెండ్ చేశారు.
చిత్తూరు జిల్లా ఫారెస్టు అధికారి (DFO)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం కోడూరు సబ్ డీఎఫ్వోగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎఫ్ఓగా ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు.
అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.
సోమశిల జలాశయంలో 74 TMCల నీటిమట్టం దాటితే నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 70 TMCల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసులకు సమాచారం చేరవేశారు. 11వ తేదీ నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డ్యాంకు ప్రవాహం కొనసాగుతోంది.
ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్లో 3 ప్రధాన రైళ్లు ఆగనున్నాయి. గత నెలలో రైల్వే GMకు MP మాగుంట దొనకొండ, కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్, వాస్కోడిగామా, ప్రశాంతి ఎక్స్ప్రెస్లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.
అర్లీ ఖరీఫ్లో పండించిన ఉల్లి రైతులకు రూ.1,200 మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం ఉల్లి కొనుగోళ్ల అంశానికి సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కొనుగోళ్ల కమిటీ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రైతుల నుంచి ఆధార్, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వారం రోజుల్లో 50 వేల టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం యూరియా డిమాండ్, నిల్వలు, సరఫరాపై జేసీ అదితి సింగ్, ఎస్పీ అశోక్ కుమార్లతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇప్పటికే 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను ఆయా ప్రాంతాల రైతు సేవా కేంద్రాలు, సంబంధిత డీలర్ల ద్వారా అందించామన్నారు. సరిపడా యూరియాను అందించేందుకు సిద్ధం చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.