India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. మండవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై చింతపాడుకు చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు SI రామచంద్రారావు తెలిపారు. బాలిక ఈనెల 15న ఫ్రెండ్ పిలిచిందని స్కూల్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెల్లి ఆత్యాచారం చేయగా.. మరో నలుగురు వీడియో తీసి బాలిక తల్లికి పంపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.
మండలంలోని వగత్తూరు గిరిజన కాలనీకి చెందిన చెంచయ్య (36) కుటుంబ కలహాలతో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వగత్తూరు గిరిజన కాలనీకి చెందిన చెంచయ్య గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నిర్వహిస్తున్న ఈఏపీసెట్ 2024 పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈనెల 16 నుంచి బైపీసీ, ఎంపీ విభాగాలకు గాను జరుగుతున్న పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. జిల్లాలోని చిలకపాలెం, ఎచ్చెర్ల, టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. జేఎన్టీయూ కాకినాడ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు వాల్తేరు డివిజన్ పరిధిలో పలు రైళ్లకు అత్యాధునిక LHB కోచ్లను జత చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. ఈనెల 24 నుంచి విశాఖ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్, 25 నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విశాఖ వీక్లీ ఎక్స్ప్రెస్, 26 నుంచి విశాఖ పారాదీప్ వీక్లీ ఎక్స్ప్రెస్కి ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
మండవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై చింతపాడుకు చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు SI రామచంద్రారావు తెలిపారు. బాలిక ఈనెల 15న ఫ్రెండ్ పిలిచిందని స్కూల్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెల్లి ఆత్యాచారం చేయగా.. మరో నలుగురు వీడియో తీసి బాలిక తల్లికి పంపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.
గంట్యాడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఆడుకుంటున్న సమయంలో 54 సంవత్సరాలు వయస్సు గల అడ్డూరి చందర్రావు మంగళవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో రక్తం మడుగులో ఉన్న బాలికను విజయనగరం హాస్పిటల్కి చికిత్స నిమిత్తం తరలించారు. బాలిక అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్కి తరలించారు.
బల్లికురవ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఉద్యోగరీత్యా HYDలో నివాసం ఉంటోంది. ఆమె స్నానం చేస్తుండగా ఓ యువకుడు ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. కొద్దిరోజులకు ఆ వీడియోను ఆమెకు పంపి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. యువతి రూ.40 వేలు ఫోన్ పే ద్వారా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని వీడియో తొలగించాలని కోరింది. అవమానానికి గురై బస్సులో ఇంటికి వస్తూ పురుగుమందు తాగింది. ఆమెను ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు.
ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-35 వయసు గల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలో 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఒరిజినల్ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు బయోడేటా జిరాక్స్ కాపీలు 2 సెట్లు, పాస్పోర్టు సైజు ఫోటోలతో ఉ. 9 గంటలకు హాజరు కావాలాని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.
వీరపునాయునిపల్లె మండలం బసిరెడ్డిపల్లెకు చెందిన హర్షిత చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై వివరాల మేరకు.. హర్షితను పోరుమామిళ్ల మండలం కల్వకుంట్లకు చెందిన క్రాంతి కిరణ్ ప్రేమిస్తున్నానంటూ ఫోన్ చేసి మానసికంగా వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం పురుగుమందు తాగింది. చికిత్స నిమిత్తం కుటుంబీకులు తిరుపతి స్విమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI వెంకటరెడ్డి తెలిపారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రికెట్ మైదానంలో ఈ నెల 24న బాలికల అండర్-15, 19 సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి సత్యనారాయణ బుధవారం తెలిపారు. అండర్ 15 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2009, అండర్ 19 జట్టుకు సెప్టెంబర్ ఒకటి 2005 తరువాత పుట్టిన వారు అర్హులన్నారు.
Sorry, no posts matched your criteria.