Andhra Pradesh

News May 22, 2024

ఏలూరు: అందుబాటులో టెన్త్, ఇంటర్ హాల్ టికెట్స్

image

ఏపీ దూరవిద్య ద్వారా జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ఉన్నాయని చెప్పారు. లేదా ఓపెన్ స్కూల్స్ సెంటర్ల కో-ఆర్డినేటర్ల నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చు అని స్పష్టం చేశారు.

News May 22, 2024

పీటీఎం: నిద్ర మాత్రలు మింగిన యువకుడు

image

పీటీఎం మండలంలో ఓ యువకుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఒడ్డిపల్లెకి చెందిన మురళి (38) కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. దీంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబీకులు గమనించి బి.కొత్తకోటకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు అతనికి మెరుగైన వైద్యం అందించారు.

News May 22, 2024

అప్పుల బాధ ఎక్కువై యువ రైతు ఆత్మహత్య

image

బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యువ రైతు అప్పుల బాధ ఎక్కువై గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలకు వెళితే.. ప్రవీణ్ కుమార్ వ్యవసాయంలో అప్పులు కావడంతో తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతణ్ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు ఆవరించాయి.

News May 22, 2024

VZM: పది సప్లమెంటరీ పరీక్షలు రాయనున్న 4,210 మంది విద్యార్థులు

image

ఈ నెల 24 నుంచి జూన్ 3 వ‌ర‌కు ప‌దోత‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ప్రారంభకానున్నాయి. ప‌రీక్ష ఉద‌యం 9.30కి మొదలై మ‌ధ్యాహ్నం 12.45కి ముగుస్తుంది. జిల్లాలో మొత్తం 4,210 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. వీరిలో 2,482 మంది బాలురు, 1728 మంది బాలికలు ఉన్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 19 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News May 22, 2024

ప.గో: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

ముత్యాపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఐసెట్టి మల్లిఖార్జునరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మొగల్తూరుకు చెందిన మల్లిఖార్జునరావు గత ఏడాది బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తన ఇంటిలో ఉండగా ఉదయం 6గంటల సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో అదే నిమిషంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News May 22, 2024

స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. అక్కడ భద్రతా సిబ్బంది పనితీరును, సీసీ కెమెరాలు విభాగాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల అభ్యర్థుల వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.

News May 22, 2024

శ్రీకాకుళం: ఎస్పీని సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

image

లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ రాధికను అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు గాను అధిక ఓటింగ్ శాతం నమోదు, ఎన్నికలు సజావుగా శాంతియుతంగా నిర్వహించినందుకు గాను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు బుధవారం సాయంత్రం ఆమెను సత్కరించి, అభినందనలు తెలిపారు. వారిలో ప్రతినిధులు సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, తదితరులు ఉన్నారు.

News May 22, 2024

అప్రమత్తంగా ఉండండి: నెల్లూరు కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 22, 2024

అల్లర్లు సృష్టించే వారు ఒకసారి ఆలోచించండి: ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకను తిప్పి కొట్టడానికి శాఖ టీంలు రెడీగా ఉన్నాయని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులో జరిగిన మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అల్లర్లు సృష్టించాలని రోడ్డు ఎక్కేవారు ఒకసారి తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించి రోడ్డుపైకి వెళ్లాలని సూచించారు. ఏది ఏమైనా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు.

News May 22, 2024

కృష్ణా: రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

image

అల్పపీడన ప్రభావంతో రేపు గురువారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. అటు పొరుగున ఉన్న ఏలూరు జిల్లాలో సైతం వర్షాలు పడతాయని APSDMA హెచ్చరించింది.