India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైవే పెట్రోలింగ్ సిబ్బంది రావులపాలెం వైపు గస్తీ నిర్వహిస్తుండగా సిద్ధాంతం బ్రిడ్జిపై సుమారు 45 ఏళ్ల మహిళ గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించారు. గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది రాజబాబు, దుర్గారావు, విజయ చందర్ వెంటనే చేరుకుని ఆ మహిళను అతి కష్టం మీద ఆపగలిగారు. ఆ మహిళను తమ వెంటబెట్టుకుని రావులపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులకు బ్రిడ్జిపై జరిగిన సంఘటన వివరించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం పలాస మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06089 తాంబరం- సత్రాగచ్చి ట్రైన్ను జూన్ 5 నుంచి జూలై 3 వరకూ ప్రతి బుధవారం, నం.06090 సత్రాగచ్చి- తాంబరం ట్రైన్ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
జిల్లా పర్యటనను ముగించుకుని విజయవాడకు బయలుదేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీస్, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ GM సుందరవల్లి, రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి వీడ్కోలు పలికారు. విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవం ముగియగానే గవర్నర్ బుధవారం సాయంత్రం నెల్లూరు నుంచి విజయవాడకు బయలుదేరారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్సైట్లో జూన్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.
విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే మెము ఎక్స్ప్రెస్లను నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు నైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30వరకు నం.07278 భద్రాచలం రోడ్- విజయవాడ, నం.07979 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
కొరియర్ పేరుతో వచ్చే కాల్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దీపిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్లైన్లో బుక్చేసిన ఐటమ్ యొక్క పార్సల్౨లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని కేసు నమోదైందని సీబీఐ లేదా పోలీసుల మంటూ సైబర్ నేరగాళ్లు బెదిరిస్తారని చెప్పారు. విచారణకు రమ్మంటారని, రాలేమంటే ఆన్లైన్లోనే రావచ్చునని చెప్పి, ఓ లింక్ పంపిస్తారని దాన్ని తెరిస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయని ఎస్పీ వివరించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు తూ.గో జిల్లాలో బాణసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరగనున్నందున ఆ రోజు ఎక్కడా బాణసంచా కాల్చకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నామన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్పారు. బుధవారం అమరావతిలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. సంబంధం లేని కేసులలో టీడీపీ నేతలను చేర్చి వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పారు. తాడిపత్రిలో పోలీసులు వైసీపీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించుటకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో వివిధ శాఖల (రవాణా, పరిశ్రమలు, ఏ.పీ.ఐ.ఐ.సీ, పర్యాటక, కార్మిక, చేనేత, కాలుష్య నియంత్రణ) ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ నెల 24 నుంచి 31 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు 14,904 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 7,927 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 42 పరీక్షా కేంద్రాల్లో, మొదటి సంవత్సర పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటలు వరకు, రెండో సంవత్సర పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.