Andhra Pradesh

News May 22, 2024

కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పోలీసుల కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

image

పోలింగ్ అనంతరం చెలరేగిన హింసలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు ముందస్తు భద్రత చర్యలలో భాగంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని అవనిగడ్డ, పెడన, వివిధ నియోజకర్గాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి తనిఖీలు చేశారు. కౌటింగ్ నేపథ్యంలో ఎవరూ అల్లర్లు, గొడలు సృష్టించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News May 22, 2024

కడప: మొదటి కౌంటింగ్ కమలాపురం నుంచే?

image

జూన్ 4న జరగనున్న జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కు ప్రతి నియోజకవర్గంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో 18 రౌండ్లు, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, కడపలో 21 రౌండ్లు, పులివెందులలో 22, జమ్మలమడుగులో 23 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది. దీంతో కమలాపురం ఫలితం మొదటగా, జమ్మలమడుగు ఫలితం చివరగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.

News May 22, 2024

NLR: 4 వరకు సర్వీస్ ఓటర్లకు అవకాశం

image

దూర ప్రాంతాల్లో ఉంటున్న నెల్లూరు జిల్లా ఉద్యోగులు తమ సర్వీసు ఓట్లను వినియోగించుకుంటున్నారు. ఆర్మీలో పని చేస్తున్న వారికి ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్(ETPBS) ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. వీళ్లు ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఓటు వేయవచ్చు. ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే 47 సర్వీసు ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 13 మంది ఓటు వేశారు.

News May 22, 2024

పెద మానాపురం: బావిలో పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై శిరీష బుధవారం విలేకరులకు తెలిపారు. విశాఖకు చెందిన కునిచెర్లపటి శివాజీ కుమార్ (60)తో పాటు మరో నలుగురు చినకాద శివారు రాజుల పేటలో జరిగే పండగకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వాష్ రూమ్‌కి వెళ్లిన కుమార్ ఎంతకీ రాకపోయేసరికి పరిసర ప్రాంతాలు వెతకగా నేలబావిలో మృతదేహం లభించిందని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

News May 22, 2024

సత్యసాయి జిల్లాలో 66.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 32 మండలాలకు గాను 6 మండలాలలో వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షపాతం మండలాలు వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. అమడగూరులో 20.5, ఓడిసిలో 16.2, గోరంట్లలో 11.0, తనకల్లులో 6.8, తలపులలో 6.2, నల్లచెరువు మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

News May 22, 2024

పర్చూరు: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

image

యద్దనపూడి -పోలూరు గ్రామాల మధ్య బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తాళ్ళూరి వినోద్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. దర్శిలో ఈయన MPP స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం బైకుపై పోలూరు వెళ్తుండగా గుంతలు తప్పించే క్రమంలో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

News May 22, 2024

BREAKING: గుంటూరులో పట్టపగలు దారుణ హత్య

image

గుంటూరులో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శారదా కాలనీ సమీపంలోని సంజీవనగర్ వద్ద బుధవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలుపు చొక్కా, గ్రే కలర్ ప్యాంటు ధరించిన ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా పొడిచి హత్య చేసి పరారైనట్లు తెలుస్తుంది. మృతుని వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News May 22, 2024

రేపల్లె: వ్యక్తి హత్య కేసులో నిందితులు అరెస్ట్

image

రేపల్లె మండలంలోని గుడ్డికాయలంకకు చెందిన యరగళ్ల <<13248511>>సుబ్బారావును హత్య చేసి తల తీసుకెళ్లిన కేసులో<<>>, నిందితులను అరెస్ట్ చేశామని పట్టణ సీఐ నజీర్ బేగ్ మంగళవారం తెలిపారు. విశ్వనాథపల్లి రాంప్రసాద్ (జగనన్న కాలనీ), బడుగు ఆదర్శ్ (రేపల్లె మండలం బేత పూడి)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న రేపల్లె జగనన్న కాలనీ పక్కనున్న లేఅవుట్‌లో హత్య జరిగింది. కోర్టులో హాజరు పరిచామని సీఐ పేర్కొన్నారు.

News May 22, 2024

అనంత జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటల నష్టం రూ.1.84 కోట్లు

image

అనంత జిల్లాలో గాలివానతో కూడిన వర్షంతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. యల్లనూరు, యాడికి, కూడేరు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, కుందుర్పి, శెట్టూరు, ఉరవకొండ, అనంతపురం, బెళుగుప్ప మండలాల్లో అరటి తోటలు నేలవాలగా, మామిడి, టమాటో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. 33మంది రైతులకు చెందిన 59 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రూ.1.84 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

News May 22, 2024

ఆర్చరీ ప్రపంచకప్‌లో విజయవాడ క్రీడాకారిణి వెన్నం జ్యోతి

image

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ర్యాంకింగ్ రౌండ్‌లో నాలుగో స్థానం సాధించింది. గతనెల షాంఘైలో స్టేజ్-1 టోర్నీలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన సురేఖకు మహిళల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో టాప్-3లో స్థానం కొద్దిలో చేజారింది. సురేఖ ప్రదర్శనతో టీమ్ విభాగంలో భారత్‌కు రెండో సీడింగ్ లభించింది. కాగా సురేఖ విజయవాడకు చెందిన క్రీడాకారిణి కావడం విశేషం.