Andhra Pradesh

News September 23, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం

image

ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్ కు సంబంధించి సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్‌లో ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 26న మార్పునకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 562 సీట్లకు గాను ఈ కౌన్సిలింగ్‌కు 303 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి క్లాస్ వరకు ప్రారంభం కానున్నాయి.

News September 23, 2024

కనిగిరిలో సెప్టెంబర్ 27న ‘మెగా జాబ్ మేళా’

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీడప్ – ఆధ్వర్యంలో.. సెప్టెంబరు 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో జరగబోవు “మెగా జాబ్ మేళా” వాల్ పోస్టర్‌ను సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

News September 23, 2024

కడప హజ్ హౌస్‌ను త్వరగా పూర్తి చేయాలి: చంద్రబాబు

image

సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం పలు విషయాల గురించి చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా.. కడపలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న హజ్ హౌస్ నిర్మాణం గురించి అధికారులను అడిగారు. 80% పూర్తయిందని తెలుపగా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదివరకు ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

News September 23, 2024

పూసపాటిరేగ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

image

విజయనగరంలో జిల్లా పూసపాటిరేగ మండలంలోని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదైన పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.7వేలు జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పెద్దపతివాడ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా నేరం రుజువైందని చెప్పారు.

News September 23, 2024

అమరావతి: మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష

image

మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్ చేయాలని ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలన్నారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10, రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలాన్నారు. భూముల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 23, 2024

శ్రీకాకుళం: 85 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు ఎండార్స్ చేశారు. చట్ట పరిధిలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

News September 23, 2024

25, 2 6న వెంకటగిరిలో మద్యం దుకాణాలు బంద్

image

వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ నెల 25న మధ్యాహ్నం 3 గం. నుంచి 26న రాత్రి 7 గంటల వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు. అలాగే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు సూచించారు. బందోబస్తు, భద్రత చర్యలు పకడ్బందీగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు.

News September 23, 2024

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: SP

image

కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. కడప నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులకు ఫిర్యాదులను పంపిస్తూ వాటిని విచారించి సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.

News September 23, 2024

పులివెందుల: అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్సీ

image

పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్సీకి వివరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

News September 23, 2024

ప్రకాశం జిల్లాలో మైనింగ్ అధికారుల బదిలీలు

image

ప్రకాశం జిల్లాలోని ప్రాంతీయ మైనింగ్ విజిలెన్స్ అధికారుల బృందం సోమవారం ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం నూతనంగా AD సురేశ్ కుమార్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజులను నియమించారు. వీరు మంగళవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న అధికారిని తిరుపతికి బదిలీ చేశారు.