India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్ చేయాలని ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలన్నారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10, రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలాన్నారు. భూముల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు ఎండార్స్ చేశారు. చట్ట పరిధిలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఈ నెల 25న మధ్యాహ్నం 3 గం. నుంచి 26న రాత్రి 7 గంటల వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కోరారు. అలాగే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు సూచించారు. బందోబస్తు, భద్రత చర్యలు పకడ్బందీగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు.
కడప జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. కడప నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులకు ఫిర్యాదులను పంపిస్తూ వాటిని విచారించి సత్వరమే ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్సీ స్వగృహంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్సీకి వివరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ప్రకాశం జిల్లాలోని ప్రాంతీయ మైనింగ్ విజిలెన్స్ అధికారుల బృందం సోమవారం ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం నూతనంగా AD సురేశ్ కుమార్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజులను నియమించారు. వీరు మంగళవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న అధికారిని తిరుపతికి బదిలీ చేశారు.
శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వర్ణంద్రా 2047 గోడ పత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రచించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.
అనంతపురం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ పరిధిలో ఖాళీగా ఉన్న 84 అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్ పోస్టుల భర్తీకి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 24 నుంచి అక్టోబర్ 1 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్లు ఆధారంగా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు సీడీపీఓ కార్యాలయంలో సంప్రదించి వివరాలు పొందవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా ఉరిటి సాయికుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విధుల్లో చేరారు. గతంలో మన్యం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా ఈయన విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలో శ్రీకాకుళం జిల్లా అధికారిగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ను కలుసుకున్నారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని విజయనగరం పైడిమాంబ, రామతీర్థం రామస్వామి ఈ రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి అవసరమైన సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏడాదికి ఒక సారి టెండర్లు నిర్వహిస్తుంటారు. ఎవరైతే తక్కువ ధరకు వస్తువులు పంపిణీ చేస్తామని కోట్ చేస్తారో వాళ్లకే టెండర్ దక్కుతుంది. ఇది ఏళ్ల కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.