Andhra Pradesh

News September 23, 2024

కర్నూలు డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి

image

కర్నూలు జిల్లాలో వివిధ శాఖలకు అధికారులను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నూతన డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిగా రామనాథరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్‌గా నాగసుధను నియమించారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సలాం బాషాను సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 23, 2024

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న రెండు రోజులూ వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయశంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం, మంగళవారం ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News September 23, 2024

పడాల శరత్ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్

image

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, మాజీ మంత్రి పడాల అరుణ కుమారుడు పడాల శరత్ మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పుత్ర శోకాన్ని తట్టుకోగల ధైర్యాన్ని అరుణ గారికి ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నానని అన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.

News September 23, 2024

పొలం పిలుస్తుంది సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

రైతుసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాలో ఈనెల 24 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తమిమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారులు సూచించే పద్ధతులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు.

News September 23, 2024

మారేడుమిల్లి: జలపాతంలో గల్లంతైన రెండు మృతదేహాలు లభ్యం

image

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిని కె.సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది.

News September 23, 2024

ఏలూరు: జలపాతంలో గల్లంతైన రెండు మృతదేహాలు లభ్యం

image

మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిని కె.సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది.

News September 23, 2024

సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి

image

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం స్టోర్‌లో ఈనెల 21న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేశారు. ప్రస్తుతం రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలు విక్రయిస్తారు. సోమవారం వంద డబ్బాల విశాఖ డెయిరీ నెయ్యి(1500 కేజీలు) దేవస్థానానికి రానుంది.

News September 23, 2024

3న తిరుమలకు పవన్..?

image

తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆయన అక్టోబర్ 3న తిరుమలకు వచ్చే అవకాశం ఉందని జనసేన నాయకులు వెల్లడించారు.

News September 23, 2024

ATP: అయ్యో.. 15 రోజుల్లోనే ఆనందం ఆవిరి!

image

బుక్కరాయసముద్రం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఓ.పవన్ అనే యువకుడు మదనపల్లిలో ఎంబీఏ పూర్తి చేసి 15 రోజుల క్రితం ఐటీ ఉద్యోగం సాధించారు. తమ కుమారుడికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం రెండు వారాల్లోనే ఆవిరైందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతమయ్యారు. మంచి భవిష్యత్తును ఊహించుకున్న ఆ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం స్థానికంగా తీవ్ర విషాదం మిగిల్చింది.

News September 23, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంప్రెడా మైన్స్ అండ్ మినరల్స్ ఛైర్మన్ ఏఎస్ విక్రమ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబును కలిసి ఆ చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విక్రమ్‌ను చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.