India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు అర్బన్ పీఎస్ పరిధిలోని గార్గేయపురం చెరువులో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళల మృతదేహాలు కలకలం రేపాయి. పర్యాటక ప్రాంతమైన గార్గేయపురం చెరువులో మృతదేహాలు నీటిపై తేలియాడుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కర్నూలు డీఎస్పీ కరణం విజయ శేఖర్, అర్బన్ సీఐ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి పరిశీలిస్తున్నారు.
కర్నూలులోని గీతాముఖర్జీ నగర్కు చెందిన పఠాన్ మహ్మద్ షఫీఖాన్పై శనివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ‘డిగ్రీ చదువుతున్న నా కూతురిని ప్రేమిస్తున్నానంటూ షఫీఖాన్ నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి నా కూతురిని దూషించి, బెదిరించాడు. ఇంటి ముందు ఉన్న బైక్పై పెట్రోల్ పోసి నిప్పంటించి వీరంగం సృష్టించాడు’ అంటూ యువతి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఈమె.. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చెన్నైలోని కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అదే సమయంలోనే యూపీఎస్సీకి ప్రయత్నించి 2015లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఈమె కర్నూలు అదనపు ఎస్పీగా, అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు.
చంద్రగిరి సమీపంలో ఐతేపల్లి వద్ద నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు <<13272611>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతుడు రేణిగుంట మండలం ఆర్.మల్లవరానికి చెందిన సందీప్గా గుర్తించారు. తల్లిదండ్రుల కోరిక మేరకు అమెరికాలో ఉద్యోగం మానేసి బెంగళూరుకు వచ్చి సాప్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. పెళ్లిచూపులు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పడంతో కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో చనిపోయాడు.
అత్తింటి వేధింపులు తాళలేక ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన సంఘటన బుచ్చయ్యపేట మండలం ఎల్బిపి అగ్రహారంలో చోటుచేసుకుంది. ఎస్ఐ డి.ఈశ్వరరావు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కిల్లి శ్రావణికి తమరాన రేణుకృష్ణతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. రేణుకృష్ణ ఆర్మీలో దిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రావణి అత్తింట్లోనే ఉంటుంది. అత్తింటి వేధింపులతో శ్రావణి మనస్థాపానికి గురై ఉరి వేసుకుంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తులు పురిటి బిడ్డ మృతదేహాన్ని మూటగట్టి ఆనకట్టలో పడేశారు. ఇవాళ ఉదయం అటువైపు వాకింగ్ వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనకట్ట సమీపంలోనే పలు హాస్పిటల్స్ ఉన్నాయి. డెలివరీ సమయంలో బిడ్డ చనిపోవడంతో పడేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హజ్ యాత్ర నిర్వహణపై కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ అంశంపై తాజాగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 30 వరకూ గన్నవరం మండలం కేసరిపల్లిలోని జామియా మసీదు వద్ద హజ్ యాత్రికులకై ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరం ద్వారా హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
భారతీయ వాయుసేనలో అగ్ని వీర్ వాయు సైనికుల ఉద్యోగం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల శనివారం తెలిపారు. పదవ తరగతి తస్సమానమైన అర్హత కలిగి ఉండాలన్నారు. ఫ్లూట్, కీబోర్డ్, పీయానో ఏదైనా సంగీత ప్రావీణ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆసక్తిగల యువకులు మే 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఈ నెల 21 అనగా మంగళవారం నాడు అండర్-16 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి ఎంఎల్ఎన్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరు కానున్న క్రీడాకారులు స్టడీ, ఆధార్ కార్డులు పట్టుకొని ఆరోజు ఉదయం 6.30 గంటలయ్యేసరికి విజ్జీ మైదానంలో ఉండాలని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు నుంచి ఏలూరు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ మీర్జాపురం వద్దకు రాగానే టైర్ పేలి పోవడంతో అదుపుతప్పి హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు వస్తున్న ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.