Andhra Pradesh

News May 19, 2024

గురజాల: అల్లర్లు, హింసాత్మక ఘటనలు చేసిన వారికోసం ముమ్మర తనిఖీలు

image

సబ్ డివిజన్ పరిధిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గురజాల, మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై మొత్తం 59 కేసులు నమోదు చేయగా ఇప్పటి వరకు 584 మంది గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం అధికారులు సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.

News May 19, 2024

నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఇదే చర్చ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈక్రమంలో జిల్లాలో ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు స్థానికులకు ఫోన్ చేసి మీ దగ్గర ఎవరు గెలుస్తారని ఆరా తీస్తున్నారు. మరోవైపు నెల్లూరు సిటీలో మెజార్టీపై, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News May 19, 2024

డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 11 మంది డిబార్

image

డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శనివారం 11 మంది డిబార్ అయినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. కాగా నంద్యాల పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఇద్దరు, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సెయింట్ జోసప్, ఆళ్లగడ్డ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల, అనంత డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు తెలిపారు.

News May 19, 2024

నేడు అన్నవరం సత్యదేవుని కళ్యాణవేడుక

image

సత్య దేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కళ్యాణం ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానుంది. వీఐపీలు, భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో అలంకరణ చేయనున్నారు. కొండ దిగువ నుంచి కొండపైకి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 1 గంట మధ్య ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు.

News May 19, 2024

ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఓటు వేయలేదు అంటే?

image

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో 87.21% పోలింగ్ నమోదైంది. 18,22,470 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,14,832 మంది ఓటు వేయలేదు. నియోజకవర్గాలు వారిగా చూస్తే వై.పాలెంలో 20,423, దర్శి 18,741, SN.పాడు 25,012, ఒంగోలు 32,502, కొండపి 26,919, మార్కాపురం 23,992, గిద్దలూరు 33,921 కనిగిరి 33,322 మంది ఓటు వేయలేదు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91, గిద్దలూరులో అత్యల్పంగా 84.37% నమోదైంది.

News May 19, 2024

ప.గో.: తాను చనిపోయినా.. మరొకరికి ప్రాణం

image

ప.గో. జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలేనికి చెందిన పవన్ (19) ఇటీవల ఇంటివద్ద కొబ్బరిచెట్టు మీదపడగా గాయపడ్డాడు. విశాఖ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అవయవదానం చేస్తే మరొకరికి ప్రాణం పోస్తాయని ఆలోచించి పుట్టెడు దు:ఖంలోనూ తల్లిదండ్రులు శ్రీనివాస రావు, శ్రీదేవి ముందుకొచ్చారు. కుమారుడి అవయవాలను విశాఖ కిమ్స్‌లో దానం చేశారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు.

News May 19, 2024

విశాఖ: ఫెడెక్స్ కొరియర్ మోసంపై 12 కేసులు నమోదు

image

సైబర్ మోసగాళ్లు ఫెడెక్స్ కొరియర్ పేరు మీద పలు మోసాలకు పాల్పడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ నగరంలో 12 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో బాధితులు రూ.5.93 కోట్ల మేర నష్టపోయినట్లు తెలిపారు. బాధితులు సకాలంలో స్పందించి 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో రూ.1.04కోట్ల నగదును వేరే ఖాతాలకు మళ్లించకుండా అడ్డుకున్నామన్నారు.

News May 19, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భార్యా భర్తకు పోస్టింగ్

image

ఆ భార్యాభర్తలు ఐపీయస్‌ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో ఎస్‌పీలుగా ప్రభుత్వం నియమించింది. వారే పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్‌పీలుగా భార్య భర్తలు మల్లిక గర్గ్‌, వకుల్‌ జిందాల్‌లు. భార్యా భర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తప్పదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే ఇద్దరికి పోస్టింగ్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

News May 19, 2024

పార్వతీపురం: తెలంగాణ ఎంసెట్‌లో శ్రీనిధి ప్రతిభ

image

కొమరాడ మండలం దళాయిపేటకి చెందిన ధనుకొండ శ్రీనిధి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ధనుకొండ శ్రీనివాసరావు, సుశీల ఇద్దరూ ఉపాధ్యాయులే. శ్రీనివాసరావు నెల్లిమర్ల మండలం సారిపల్లి జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. శ్రీనిధి పదో తరగతిలో కూడా మంచి మార్కులు సాధించింది. విద్యార్థినిని ఆమె తల్లిదండ్రులు, బంధువులు అభినందించారు.

News May 19, 2024

ఎన్టీఆర్: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా రాయనపాడు మీదుగా విశాఖపట్నం(VSKP), మహబూబ్‌నగర్(MBNR) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.12861 VSKP- MBNR ట్రైన్‌ను ఈ నెల 19 నుండి జూన్ 3 వరకు, నెం.12862 MBNR- VSKP ట్రైన్‌ను ఈ నెల 20 నుండి జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.