Andhra Pradesh

News May 19, 2024

విశాఖ: తాగునీటికి అంతరాయం.. జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ పరిధిలోని జోన్ -2 మే నెల 20న తాగునీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు మెరుగైన తాగనీటి సరఫరా చేసే పనిలో భాగంగా, బోణి గ్రామం వద్ద ఉన్న కోస్తానని హేట్ వాటర్ వర్క్స్ నుంచి తగరపువలస వరకు నూతనంగా 400 మీ.మీ మందం గల పైప్ లైన్లను వేస్తున్నట్లు వివరించారు. నగర వాశుల సహకరించాలని కోరారు.

News May 18, 2024

కృష్ణా: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య ప్రయాణించే రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నెం. 06095 తాంబరం-సత్రాగచ్చి
ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం, నెం.06096 సత్రాగచ్చి-తాంబరం ట్రైన్‌ను జూన్ 7 నుంచి జూలై 5 వరకూ ప్రతి శుక్రవారం పొడిగిస్తున్నట్లు SCR తెలిపింది.

News May 18, 2024

గుంతకల్లు: ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

image

గుంతకల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని స్థానికులు గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

News May 18, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్)కు స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం. 06077 ట్రైన్‌ను జూన్ 1 నుంచి 29 వరకు ప్రతి శనివారం చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News May 18, 2024

శ్రీకాకుళం: డ్యూటీ ధ్రువపత్రాలు అందించాలని వినతి

image

ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ డ్యూటీ ధ్రువపత్రాలు మంజూరు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో మనజీర్‌ జిలానీ సమూన్‌ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్టర్‌ను సంఘం తరుపున అభినందనలు తెలిపారు.

News May 18, 2024

చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

image

చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముందు వెళుతున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆర్ మల్లవరానికి చెందిన సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

News May 18, 2024

ముదినేపల్లిలో పగిలిన గ్యాస్ పైప్ లైన్

image

ముదినేపల్లిలో గురజ రహదారిలో మెగా సంస్థకు చెందిన గ్యాస్ పైప్ లైన్ ప్రమాదవశాత్తు లీక్ కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఎదురుగా పెట్రోల్ బంక్ ఉండటంతో భారీ ప్రమాదం జరుగుతుందని భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్ కుమార్, గుడివాడ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. మంటలు ఏర్పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News May 18, 2024

జూన్ 4న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది: బాలనాగిరెడ్డి

image

జూన్ 4న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పథకాలకు సంబంధించి డబ్బులు చెల్లించకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసి చెల్లింపులు నిలిపివేయించారని ఆరోపించారు. చెప్పిన మాట ప్రకారం అదే ఎన్నికల సంఘం అనుమతితో ఇవాళ అన్నదాతలకు పంట నష్టపరిహారం వైసీపీ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు.

News May 18, 2024

ప్రకాశం జిల్లాపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

image

ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవాన్ని ప్రకాశం చాటి చెప్పిందని యావత్ భారతావని ప్రస్తుతం జిల్లా ప్రజలను ప్రశంసిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలోనే 87.09 శాతం పోలింగ్ నమోదుతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాదు జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కావడంతో అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా పేరుగాంచింది. ఈ రికార్డుల పట్ల జిల్లా ప్రజలకు ప్రశంసలు కురుస్తున్నాయి.

News May 18, 2024

బనగానపల్లె: దద్దనాల ప్రాజెక్టుకు 4 అడుగుల నీరు

image

బనగానపల్లె మండలం ఎర్రమల కొండల్లో శుక్రవారం రాత్రి అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా దద్దనాల ప్రాజెక్ట్ ఎగువన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధానంగా మద్దిలేటిస్వామి క్షేత్రం పరిధిలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన నీటిప్రవాహంలో అడుగంటిన దద్దనాల ప్రాజెక్టుకు 4 అడుగుల నీరు చేరింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.