Andhra Pradesh

News May 18, 2024

‘విధి నిర్వహణలో భాగంగా కూతురి పెళ్లికి వెళ్ళలేదు’

image

పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన మలికా గర్గ్ తండ్రి సత్యేంద్ర గర్గ్ గతంలో అండమాన్ నికోబార్ దీవుల డీజీపీగా, తూర్పు ఉత్తర ప్రాంతానికి జాయింట్ సెక్రటరీగా పని చేశారు. అయితే ఆయన విధుల నిర్వహణలో భాగంగా కూతురు వివాహానికి కూడా హాజరు కాలేకపోయారు. అలాగే మలికా గర్గ్‌కు 2023లో స్కోచ్ అవార్డు లభించింది. ఎవరైనా విధుల్లో తప్పు చేస్తే ఆమె ఉపేక్షించరనే పేరు కూడా ఉంది.

News May 18, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్/మే 2024లో నిర్వహించిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మే 24వ తేదీలోగా.. ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.8,00 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.

News May 18, 2024

భార్య కాపురానికి రావడంలేదని భర్త సూసైడ్

image

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్మ చేసుకున్నాడు. నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన దిరిసిమిల్లి పోతురాజు(47) శనివారం పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొద్దిరోజులుగా విడిగా జీవనం సాగిస్తున్నారన్నారు. పోతురాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య నాగలక్ష్మి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 18, 2024

VZM: డస్ట్ బిన్‌లో పసికందు మృతదేహం

image

విజయనగరం ఎంజీ రోడ్డులోని వస్త్ర దుకాణాల ఎదురుగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డస్ట్ బిన్‌లో పసికందు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. సాయంత్రం స్థానికులు డస్ట్ బిన్‌లో ఉన్న అట్ట పెట్టెకు రక్తం కనిపించడంతో దాన్ని తెరిచి చూశారు. పసికందు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 18, 2024

పెళ్లకూరు: కారు ఢీకొని వ్యక్తి మృతి

image

పెళ్లకూరు మండలం చెంబడిపాలెం 71వ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరులోని వేంకటేశ్వర భగత్ సింగ్ కాలనీకి చెందిన అలీ షేర్ రోడ్డు మీద నడిచి వెళుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొంది. ఘటనలో అలీ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లకూరు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. 

News May 18, 2024

అప్పుడు ప్రకాశం ఎస్పీ.. ఇప్పుడు పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ నియమితులయ్యారు. ఆమె గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. అనంతరం తిరుపతి ఎస్పీగా పని చేశారు. మల్లికా గార్గ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన పోలీస్ అధికారిని. కాగా ఈమె పల్నాడు జిల్లాకు వచ్చిన తొలి మహిళా ఎస్పీగా ఉన్నారు.

News May 18, 2024

కడప: ఓట్ల లెక్కింపు దృష్ట్యా 144 సెక్షన్ అమలు

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈవీఎం మిషన్లు భద్రపరిచామన్నారు.

News May 18, 2024

బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు చోరి

image

ఎమ్మిగనూరు మండలం కొటేకల్‌కు చెందిన ఇబ్రహీం అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5లక్షలు కాజేశారు. ఇబ్రహీం ఎమ్మిగనూరులోని యూనియన్ బ్యాంక్ బీసీ నిర్వహకుడిగా పనిచేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తన ఫోన్‌ను హ్యాక్ చేసి అకౌంట్ నుంచి మూడు దఫాలుగా రూ.5 లక్షలు తస్కరించినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌, హర్యానాకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ బ్యాంక్ ఖాతలకు బదిలీ అయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News May 18, 2024

పల్నాడు జిల్లా ‘పీపుల్స్ కలెక్టర్‌’గా శివశంకర్‌’

image

కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఘనత పల్నాడు మాజీ కలెక్టర్ లోతేటి శివ శంకర్‌కే దక్కుతుంది. కాగా జిల్లాలో బంగారు తల్లి ద్వారా ఆడపిల్లల్లో రక్త హానత నియంత్రన, గ్రమోదయం ద్వారా ప్రతీ శుక్రవారం గ్రామాల్లో సమస్యల పరిష్కారం. SC, STల అబ్యున్నతికి నవోదయం వంటి పలు అభివృద్ది కార్యక్రమాలతో ‘పీపుల్స్ కలెక్టర్‌’గా పేరు సంపాదించుకున్నారు.

News May 18, 2024

22న నెల్లూరుకు గవర్నర్ రాక

image

వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవం ఈ నెల 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ హాజరుకానున్నారు. 22న ఉదయం 10.40 గంటలకు హెలికాఫ్టర్‌లో నెల్లూరులోని పోలీస్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 11.30 గంటల నుంచి 12.50 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారని వర్సిటీ వర్గాలు తెలిపాయి.