Andhra Pradesh

News September 9, 2025

అమరావతికి మరో ప్రముఖ సంస్థ

image

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు

News September 9, 2025

నరసాపురం వరకు వందేభారత్ రైలు పొడిగింపునకు లేఖ

image

వందే భరత్ రైలు సర్వీస్‌ను చెన్నై – విజయవాడ నుంచి భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు రైల్వే కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ CM రమేష్‌కు లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు పొడిగింపు వల్ల రవాణ వేగం పెరుగుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగ పడుతుందని లేఖలో రాసినట్లు తెలిపారు.

News September 9, 2025

ఆలయంలో అగ్నిప్రమాదంపై ఎస్పీ విచారణ

image

మొగల్తూరులోని శ్రీ నడివీధి ముత్యాలమ్మ ఆలయ దహనానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా నేర పరిశోధనలో నిపుణులైన FSL బృందం, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక భద్రతా బృందాలు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాయన్నారు. తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

News September 9, 2025

ఎస్.కోట: ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

image

ఎస్.కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ స్థానిక వన్ వే రోడ్డుపై నడిచి వెళుతున్న వల్లయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News September 9, 2025

విశాఖ: ‘అత్యాచార నిందితులకు కఠినంగా శిక్షిస్తాం’

image

మూగ బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్ రాయపాటి శైలజ తెలిపారు. కేజీహెచ్‌లో మంగళవారం ఆమె బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కామాధులకు కళ్ళు తెరిచేలా శిక్ష పడుతుందని అన్నారు.

News September 9, 2025

నెల్లూరు: రేషన్ డీలర్స్‌కి కొత్త మిషన్లు

image

నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల రేషన్ డీలర్స్‌కు ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మిషన్లను నెల్లూరు అర్బన్ MRO ఆఫీసులో అందజేశారు. వీటి ద్వారా సరుకులను సులభతరంగా ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని సిబ్బంది తెలిపారు. గతంలో బటన్స్ నొక్కి ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు. కొత్త మిషన్లకు టచ్ స్క్రీన్ ఇవ్వడంతో నంబర్లను ఎంటర్ చేసేందుకు సులువుగా ఉంది. డివిజన్ పరిధిలో 300 వరకు మంగళవారం అందించినట్లు చెప్పారు.

News September 9, 2025

అనంత: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై రాళ్ల దాడి

image

అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ విజయోత్సవ భారీ బహిరంగ సభను ఘనంగా జరుపుకునేందుకు కూటమి నేతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కారుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. రాళ్ల దాడిలో దెబ్బతిన్న కారును పోలీసులు పరిశీలించారు.

News September 9, 2025

విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

image

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయనగరం ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, ఇబ్బందులను 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.

News September 9, 2025

పోలేరమ్మ జాతర నైవేద్యంతో ఆరోగ్యం

image

వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లికి జాతర సందర్భంగా పెట్టే నైవేద్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపాకు అంటు వ్యాధులు ప్రబలకుండా వైరస్‌ను నివారిస్తుంది. సొంటి అన్నం వల్ల కడుపు శుద్ది చేయడంతో పాటు శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. కుడుములు వల్ల ఊపిరితిత్తులు, కండరాలు, నరములకు శక్తి లభిస్తుంది. మునగాకు వల్ల జీర్ణశక్తి, జాయింట్ పెయిన్ రిలీఫ్‌కి ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది.

News September 9, 2025

ఉదయగిరి: అంగన్వాడీలకు తప్పని రేషన్ తిప్పలు

image

ఉదయగిరి అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీలకు రేషన్ తిప్పలు తప్పడం లేదు. గత కొద్ది నెలలుగా రేషన్ షాపు మిషన్‌లో, అంగన్వాడీ యాప్‌లలో స్టాకు వచ్చినట్లు ఉన్నా తమకు సరుకులు రాలేదంటూ రేషన్ డీలర్లు చెబుతున్నారన్నారు. కొన్నిచోట్ల నూనె, కందిపప్పు ఇవ్వాలంటూ డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని అంగన్వాడీలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై దృష్టి సాధించి పరిష్కరించాలని కోరుతున్నారు.