Andhra Pradesh

News September 23, 2024

‘ఆ రెండు రోజులు పైడితల్లమ్మ దర్శనాలు ఉచితం’

image

పైడితల్లమ్మ ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు అక్టోబర్ 14,15 తేదీల్లో జరిగే తోల్లేళ్లు, సిరిమానోత్సవం రోజున భక్తులకు ఉచిత దర్శనం కల్పించేందుకు నిర్ణయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. గతంలో ఈ రెండు రోజుల్లో రూ.50,రూ.100,రూ.300 చొప్పున టికెట్లు వసూలు చేసేవారు. ఈ ఏడాది మాత్రం భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఉచిత దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. >Share it

News September 23, 2024

మంత్రాలయంలో వర్షం

image

కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మంత్రాలయంలో కుండపోత వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ వర్షంపై కొందరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న పత్తి, మిర్చి, ఉల్లి, సజ్జ తదితర పంటలు తడిసి ముద్దై నష్టపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో నేడూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

News September 23, 2024

పులివెందుల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

image

పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1984-85 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వారి గురువులను సత్కరించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని అక్కడే ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశానికి గుర్తుగా స్కూల్ ఆవరణంలో మొక్కలను నాటారు.

News September 23, 2024

సారవకోట: ఆంధ్రరాష్ట్ర చిహ్నంలో పూర్ణ కుంభం తయారీ

image

సారవకోట మండలం బూతడి గ్రామంలో ప్రాఖ్యత గాంచిన కంచు, ఇత్తడి కార్మికులు తమ నైపుణ్యంతో ఆంధ్రరాష్ట్ర చిహ్నంలో ఉన్న పూర్ణ ఘటం తయారు చేశారు. గ్రామానికి చెందిన కింతాడ అప్పారావు ఆయన కుమారుడు బుజ్జి సుమారు 40 రోజులు శ్రమించి 12 కేజీల ఇత్తడితో ఈ పూర్ణకుంభం తయారు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తయారీ దారులు తెలిపారు.

News September 23, 2024

అరకులోయలో కొంతమేర తగ్గిన పర్యాటకుల సందడి

image

పర్యాటక ప్రాంతమైన అరకులోయ గిరిజన మ్యూజియంను సందర్శించిన పర్యాటకుల సంఖ్య కొంతమేర తగ్గింది. శనివారం సాయంత్రం వర్షం పడటం, అల్పపీడనం వలన భారీ వర్షాలు పడతాయన్న ఐఎండి సూచన మేరకు అరకులోయ వచ్చిన పర్యాటకులు శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం ఇంటిముఖం పట్టారని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. శని, ఆదివారాలలో మ్యూజియంను సుమారు 1100 మంది పర్యాటకులు సందర్శించారన్నారు.

News September 23, 2024

కడప: ఫారెస్ట్ రేంజ్ అధికారులు బదిలీ

image

ఉమ్మడి కడప జిల్లాలో పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అధికారి చిరంజీవి చౌదరి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్‌లో పనిచేస్తున్న రమణారెడ్డిని కర్నూలుకు బదిలీ చేశారు. కడప నుంచి నయీమ్ అలీని బద్వేల్‌కి, పీలేరు నుంచి రామ్ల నాయక్, వెంకటరమణను తిరుపతికి, రాజంపేట నారాయణ పలమనేరుకు, రాజంపేట రఘు శంకర్‌ను తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 23, 2024

అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి

image

అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న ఓబులమ్మను కడప జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీ చేశారు. రామచంద్రారెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా DWMAలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

News September 23, 2024

ఉమ్మడి జిల్లాలో జట్లు ఎంపిక పోటీలు

image

ఉమ్మడి ప.గో.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2024-25 సంవత్సరానికి అండర్-14, 17 బాల బాలికలకు జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా 25న గొరగనమూడి హైస్కూల్లో నెట్ బాల్, పెదవేగి గురుకుల పాఠశాలలో సాఫ్ట్ బాల్, బేస్ బాల్, 26న భీమవరం SCHBRMHSలో రైఫిల్ షూటింగ్, అక్టోబర్ 1న పెనుమంట్రలో బాక్సింగ్ పోటీలు జరుగుతాయన్నారు.

News September 23, 2024

దర్శి పట్టణంలో బాలినేని ఫ్లెక్సీలు

image

‘జై జనసేన, వెల్కమ్ బాస్’ అంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు దర్శి పట్టణంలో ఫ్లెక్సీలు కట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈనెల 26న జనసేనలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శిలో ఉన్న బాలినేని అభిమానులు దర్శిలో జనసేన ఫ్లెక్సీలు కట్టారు.

News September 23, 2024

GNT: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే సోమవారం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్ హాల్లో నిర్వహించే గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు అందించవచ్చన్నారు. గ్రీవెన్స్ డేలో అందిన సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.