India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉలవపాడు(M) వీరేపల్లి STకాలనీకి చెందిన యాకసిరి చెంచయ్య(40) సోమవారం రాత్రి హైవే పై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వీరేపల్లి జంక్షన్ వద్ద బైక్పై ఊర్లోకి వెళుతున్న చెంచయ్యను నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచయ్యను హుటాహుటిన ఉలవపాడు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కర్నూలు నగర అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, ప్రజలకు ప్రత్యక్షంగా కనబడేలా ప్రగతి పనులు వేగవంతం చేయాలని మంత్రి టి.జి భరత్ స్పష్టం చేశారు. సోమవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో కమిషనర్ పి.విశ్వనాథ్తో కలసి మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేఎంసీ మలుపు విస్తరణ, కిడ్స్ వరల్డ్ కూడలి నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ పనుల జాప్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఉల్లి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం యూరియా సరఫరా, ఉల్లి పంట కొనుగోలుపై CM, CSలతో VC సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి కొనుగోలు కోసం కమలాపురం, మైదుకూరులలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 4 నుంచి ఉల్లిపంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. యూరియాపై రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
పోలీసు శాఖలో 7 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన పోలీసు జాగిలం ‘టీనా’ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. టీనా మృతి పట్ల ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం ఆవరణంలో ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ తదితరులు నివాళులు అర్పించారు.
మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు జీవీఎంసీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (I.F.C.) మధ్య ఒప్పందం కుదిరింది. రూ.553 కోట్లు చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐ.ఎఫ్.సి.తో దేశంలో తొలిసారి జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ప్లాంట్ 225 ఎం.ఎల్.డి వ్యర్థచరాలను శుద్ధి చేస్తుందని చెప్పారు
అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాకు ఈనెల 10న CBN విచ్చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం నగరానికి సమీపాన ఉన్న వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్ఎస్ గేట్ మీదుగా NH-44 జాతీయ రహదారికి మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 49 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ-కోసం కార్యక్రమానికి పోలీస్ అధికారులు హాజరై ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదుల తీవ్రతను వివరించారు.
కర్నూలు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మహిళలపై లైంగిక వేధింపులు చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్ను జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య సోమవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవం, హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తోందని తెలిపారు. లైంగిక వేధింపులు జరిగినప్పుడు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని వివరించారు.
IT పార్కుల స్థాపనకు సుమారు 5వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ సోమవారం ప్రకటించారు. త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే భోగాపురం జాతీయ రహదారికిరువైపులా 200 మీటర్ల పరిధిలో సుమారు 754 ఎకరాలను గుర్తించామన్నారు. వీటిలో 20 ఎకరాలకు పైబడిన స్థలాలను గుర్తించామన్నారు. వీటిలో 100 ఎకరాలు పైబడిన 3 బ్లాకులు ఉన్నాయన్నారు. స్థలాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.