India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 33 మందిని బదిలీ చేశారు. వారికి కేటాయించిన తహశీల్దార్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
మాజీ సీఎం జగన్ కారణంగానే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇక్కడి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను దోచుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మల్యాల ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గంగమ్మకు జలహారతి ఇచ్చారు. ఆయన వెంట నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు ఉన్నారు.
తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె. శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి, బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఉమ్మడి ప.గో జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జరిగింది. ఏలూరు జిల్లా కార్యాలయంలో ఉమ్మడి ప.గో జిల్లా రిజిస్ట్రార్లు కె శ్రీనివాసరావు, లంకా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. మొత్తం 42 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. 24 మంది జూనియర్ అసిస్టెంట్లు, 14 మంది సబార్డినేట్లు, నలుగురు షరీఫ్లను బదిలీ చేసినట్లు తెలియజేశారు.
అనంతపురం జిల్లాలో 73 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పొంది సంబంధిత కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని సూచించారు.
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య ప్రయాణించే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లు 4 రోజుల పాటు వరంగల్లో ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12739 VSKP- SC రైలు ఈ నెల 25 నుంచి 28 వరకు, నం.12740 SC-VSKP రైలు ఈ నెల 26 నుంచి 29 వరకు వరంగల్లో ఆగవన్నారు. ఆయా తేదీలలో ఈ 2 రైళ్లకు ఖాజీపేటలో ప్రత్యామ్నాయంగా స్టాప్ ఇచ్చామన్నారు.
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా గుంటూరు(GNT)- విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్ప్రెస్లను రెండు రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు నం.17239 GNT-VSKP మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 29, 30వ తేదీల్లో, నం.12740 VSKP-GNT రైలును ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీన రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మార్కాపురంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడిన వ్యక్తిని మార్కాపురం ఎస్సై సైదుబాబు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారణ చేయగా.. సదరు వ్యక్తిది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శేషమ్మ కుమారుడు శ్రీహరిగా తెల్సింది. 20 సంవత్సరాల కిందట తప్పిపోయిన అతను తన కుమారుడేనని తల్లి తెలిపింది. ఇన్నేళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా జిల్లా పరిధిలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన మేనేజర్, పారా మెడికల్ పర్సన్, బ్లాక్ కో-ఆర్డినేటర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ICDS పీడీ ఎస్. సువర్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల దరఖాస్తులను సెప్టెంబర్ 30లోపు కానూరు ఉమాశంకర్ నగర్లో ఉన్న మహిళా సంక్షేమ సాధికారత కార్యాలయంలో అందజేయాలన్నారు.
నరసన్నపేట మండలం పెద్ద కరగాంలో ఉన్న నరికివేసిన తాటి చెట్టు మొండెం నుంచి రావి మొక్క రావడంతో గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చెట్టును నరికి వేశారు. పక్షులు గింజలను చెట్ల తొర్రలో వేయడంతో రావి మొక్క వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. అటుగా వెళ్లే ప్రయాణికులు సైతం పైన చెట్టు రావడడంతో ఆగి మరీ చూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.