Andhra Pradesh

News September 9, 2025

సుజల స్రవంతి భూ సేకరణను వేగవంతం చేయండి: కలెక్టర్

image

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలోని 4 గ్రామాల్లో 108 ఎకరాలు, బొండపల్లి మండలంలోని 3 గ్రామాల పరిధిలో 126 ఎకరాల భూసేకరణపై చర్చించారు. ఈ గ్రామాల రైతులతో త్వరలో సమావేశం నిర్వహించి ధర ఖరారు చేయాలన్నారు.

News September 8, 2025

విశాఖ జిల్లాలో 67.56% స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ పూర్తి

image

విశాఖ జిల్లాలో కేటాయించిన 5,17,155 స్మార్ట్ రైస్ కార్డులలో 67.56% పంపిణీ పూర్తయింది. మండలాల వారీగా అనందపురం 84.35%, భీమునిపట్నం 79.74%, సర్కిల్-III అర్బన్ 71.93%, సర్కిల్-I అర్బన్ 59.26% పూర్తి అయ్యాయి. మిగిలిన వారికి త్వరలోనే సచివాలయ సిబ్బంది/డీలర్ల ద్వారా అందజేస్తామని.. కార్డు వివరాలు epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తెలిపారు.

News September 8, 2025

వైసీపీ నేతలు అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు: మంత్రి

image

CM చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తుందని, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి టి.జి భరత్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్నూలులో ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన సులభతర వాణిజ్య కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయ‌కులు త‌ప్పుడు వార్త‌లు రాయిస్తున్నారని ఆయన అన్నారు.

News September 8, 2025

MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

image

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

News September 8, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా చర్లపల్లి(CHZ)- సంత్రాగచ్చి(SRC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07221 CHZ- SRC రైలును SEPT 9 నుంచి NOV 29 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో, నం.07222 SRC- CHZ రైలును SEPT 10 నుంచి NOV 30 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.

News September 8, 2025

తాలాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో బింగి లక్ష్మణరావు (30) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ గోపాల్‌రావు సోమవారం తెలిపారు. అతనికి పెళ్లై 2 సంవత్సరాలైందన్నారు. మృతుడి భార్య గౌతమి (గంగమ్మ) ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 8, 2025

యూరియా లోటు లేదు: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో యూరియా లోటులేదనే విషయాన్ని రైతులకు తెలియజేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో వర్చువల్‌గా కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా లోడ్ మోతాదుకు మించి ఎరువులు వినియోగం వలన వచ్చే అనర్థాల గూర్చి క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిగించేలా కృషి చేయాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు.

News September 8, 2025

యూరియా లోటు లేదని రైతులకు తెలియజేయాలి: కలెక్టర్

image

జిల్లాలో యూరియా లోటు లేదనే విషయాన్ని రైతులకు అర్థం అయ్యేలా తెలియజేయాలని కలెక్టర్ అంబేడ్కర్ సిబ్బందికి తెలిపారు. సోమవారం PGRS అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. మొదటి విడత పంపిణీ ఇంచుమించు పూర్తి చేసామన్నారు. 2వ విడత కూడా 30 శాతంపై బడి పూర్తి చేసామని వివరించారు. మిగిలినవి వారం లోగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రెండో విడతకు ఇండెంట్ పెట్టామన్నారు. యూరియా వచ్చిన వెంటనే అందజేస్తామన్నారు.

News September 8, 2025

అధికారులపై విశాఖ కలెక్టర్ ఆగ్రహం

image

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపట్ల కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్‌‌లో గతవారం ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ, పోలీసు శాఖ ఫిర్యాదుల్లో నాణ్యమైన పరిష్కారం దొరకడం లేదన్నారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై తరచూ ఫిర్యాదులు రావడంపై మండిపడ్డారు. ఇలాంటి తీరు పునరావృతం అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

News September 8, 2025

అనంత: సూపర్-6 సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు

image

చంద్రబాబు పాల్గొనే సూపర్-6 సూపర్ హిట్ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో కలిసి ముందస్తు ఏర్పాట్ల, సెక్యూరిటీ పరిశీలన చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, ప్రధాన వేదిక, ముఖ్యమంత్రి వెళ్లే రూట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.