Andhra Pradesh

News September 8, 2025

ఉల్లిని ప్రభుత్వమే కొంటుంది: మైదుకూరు AMC ఛైర్మన్

image

ఉల్లి సాగు చేసిన రైతులు దళారులను నమ్మవద్దని, మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మైదుకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర చెప్పారు. పెద్ద బళ్లారి రకం ఉల్లి పంట చేతికొచ్చిందని.. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరగా అమలయ్యేలా చూస్తామన్నారు.

News September 8, 2025

కంద రైతులకు గిట్టుబాటు ధరపై కలెక్టర్ సమీక్ష

image

తూర్పు గోదావరి జిల్లాలో కంద రైతులకు సరైన మార్కెట్ ధర లభించకపోవడంపై కలెక్టర్ పి. ప్రశాంతి సమీక్షించారు. సోమవారం రాజమండ్రిలో ఉద్యానవన, మార్కెటింగ్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కంద పంట ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థలో సమతుల్యత తీసుకురావడానికి చర్యలు అవసరమని కలెక్టర్ తెలిపారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ఆమె సూచించారు.

News September 8, 2025

SKLM: కుల బహిష్కరణ చేశారంటూ వ్యక్తి ఆవేదన

image

ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ కుటుంబాన్ని కులబహిష్కరణ చేశారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. మెళియాపుట్టి(M) జాడుపల్లికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం బెంగాలీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అనంతరం గ్రామంలో జీవనం సాగిస్తుండగా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని స్థానికులు ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడు వాపోయాడు.

News September 8, 2025

వనిపెంట: ఆ నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు..?

image

వనిపెంట ప్రాంతంలో నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఇష్టానుసారంగా నర్సరీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత లేని, కల్తీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నర్సరీ యజమానులు కొందరు నాణ్యత లేని విత్తనాల నారును రైతులకు అంటగడుతూ లాభం పొందుతున్నారు. నర్సరీలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News September 8, 2025

GNT: వృద్ధురాలిపై అత్యాచారం

image

బాపట్ల పరిధిలోని నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.

News September 8, 2025

కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

image

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.

News September 8, 2025

ఒంగోలు: యువతిపై లైంగిక దాడికి యత్నం

image

ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తపట్నానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో అతడు దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపు నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొత్తపట్నం పోలీసులు గాలించి అతడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

News September 8, 2025

శ్రీరామపాద క్షేత్రంలో సుందర దృశ్యం

image

నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఇటీవల కృష్ణానది వరదలకు శివలింగం, నంది వాహనం పూర్తిగా మునిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయగా, సాయం సంధ్య వేళ రంగుల వర్ణాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సుందర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

News September 8, 2025

గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల బ్లాకు

image

గుంటూరు జీజీహెచ్‌లో మాతా, శిశు వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.86 కోట్లతో నిర్మిస్తున్న 500 పడకల బ్లాకులో వైద్య పరికరాల కొనుగోలుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ చర్యలతో గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

News September 8, 2025

బిక్కవోలు: భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

భార్య కాపురానికి రాలేదని ఓ వ్యక్తి మనస్తాపం చెంది కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం బిక్కవోలులో జరిగింది. ఎస్సై రవివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలుకు చెందిన రవికుమార్‌కు సోనితో వివాహమైంది. 3 నెలల కిందట భర్తపై కోపంతో మండపేటలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో రవి సామర్లకోట కాలువలో దూకాడు. అదే మార్గంలో వెళ్లున్న ఎస్సై, డ్రైవర్ అతనిని కాపాడారు.