Andhra Pradesh

News September 8, 2025

నెల్లూరు : నవ వధువు ఆత్మహత్య

image

వివాహమై ఏడాది తిరగకుండానే యువతి చనిపోయిన ఘటన ఇది. మృతురాలి తండ్రి వివరాల మేరకు.. నెల్లూరులోని గాంధీసంఘం గిరిజన కాలనీకి చెందిన ప్రశాంతి(25)కి చిట్వేల్(M) నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన రాజేశ్‌తో 9 నెలల కిందట పెళ్లి జరిగింది. రాజేశ్ తన స్వగ్రామంలోనే కాపురం పెట్టారు. ఇటీవల వీరి మధ్య కలహాలు వచ్చాయి. దీంతో ప్రశాంతి ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె తండ్రి దాసరి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 8, 2025

నేడు కర్నూలుకు వైఎస్ షర్మిల

image

ఉల్లి, టమాటా ధరల పతనంతో నష్టపోతున్న రైతులకు మద్దతుగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కర్నూలుకు రానున్నారని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలానీ బాషా తెలిపారు. ఉదయం 11 గంటలకు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులు ఆమెకు స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డులో రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు.

News September 8, 2025

ఒంగోలు: పొగాకు రైతులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని పొగా రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సాధారణంగా ప్రభుత్వం పొగాకు సాగుపై కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ మేరకు కొనుగోళ్లు చేస్తారు. లిమిట్‌కు మించి పండించిన పొగాను సైతం కొనేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ముందుకు వచ్చిందని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి రామకృష్ణ వెల్లడించారు. రైతులు అదనంగా పండించిన పంటను ఈనెల 9వ తేదీ నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు.

News September 8, 2025

విశాఖ: బీజేపీలో కొత్త జోనల్ ఇన్‌ఛార్జ్ నియామకం

image

విశాఖలో BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇన్‌ఛార్జులను ప్రకటించారు. ఉత్తరాంధ్ర జోన్‌కు మట్టా ప్రసాద్, గోదావరి జోన్‌కు లక్ష్మీప్రసన్న, కోస్తాంధ్ర జోన్‌కు నాగోతు రమేష్‌నాయుడు, రాయలసీమ జోన్‌కు ఎన్.దయాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ బలోపేతానికి వీరు సమన్వయం చేస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 8, 2025

గుంటూరు: ఆయన మనల్ని వీడి 5 ఏళ్లు గడిచాయి..!

image

ప్రముఖ తెలుగు నటుడు జయప్రకాశ్ రెడ్డిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. దాదాపు 300 సినిమాల్లో నటించిన ఈయన ఎక్కువగా విలన్, కమెడియన్ పాత్రలను పోషించారు. ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి చిత్రాలతో ఆయన ప్రాముఖ్యత పొందారు. 2020, సెప్టెంబరు 8న గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.

News September 8, 2025

ప్రముఖ శాస్త్రవేత్త కొడవటిగంటిది మన తెనాలే

image

బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీప్రసాద్ తెనాలిలో జన్మించారు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, వరూధినిలకు జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేసారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సెప్టెంబరు 8, 2012 న ముంబైలో మరణించారు.

News September 8, 2025

సంగీత దర్శకుడు మన గుంటూరు వారే

image

చక్రవర్తిగా సుపరిచితుడైన సంగీత దర్శక గాయకుడు చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు,ఆయన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో 1936 సెప్టెంబరు 8న జన్మించారు. అతను 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. చక్రవర్తి 959 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భారత తపాలశాఖ వారు గుంటూరులో 2014 సెప్టెంబర్ 9న చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేశారు.

News September 8, 2025

పుంగనూరు: 601 టన్నుల యూరియా పంపిణీ

image

పుంగనూరు వ్యవ సాయశాఖ డివిజన్ పరిధి అన్ని మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏడీ శివకుమార్ తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్లతో పాటు పెద్ద పంజాణి, గంగవరం మండలాల రైతులకు బయో మెట్రిక్ ద్వారా 601 టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు తమ పాసుపుస్తకాలు, ఆధార్ జిరాక్స్ తో యూరియా పొందాలని సూచించారు.

News September 8, 2025

హలో వైజాగ్ ఫుడీస్.. మళ్లీ కలుద్దాం..!

image

విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రముఖ రెస్టారెంట్స్, హోటల్స్‌ల ఫుడ్ ఎంజాయ్ చేశారు. సౌత్, నార్త్ తో పాటు విదేశీ రుచులు కూడా అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి బీచ్ వ్యూలో రకరకాల ఫుడ్‌ని ప్రజలు ఆస్వాదించారు. మరి ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో మీ ఫెవరెట్ ఐటెమ్ ఏదో కామెంట్ చేయండి.

News September 8, 2025

శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

image

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్‌ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్‌సీ‌హెచ్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.