India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలిక అత్యాచారానికి గురైన కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు, రూ.50వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి కె.నీలిమ శుక్రవారం తీర్పు చెప్పారు. పీపీ కె.శ్యామల కథనం ప్రకారం చాకలి గుంటకు చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని బాణావత్ గోపి నాయక్ అత్యాచారం చేశాడు. పెళ్లి కోసం ఇంటి నుంచి పరారైన బాలికను షేక్ మహమ్మద్ రఫీ అనే ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 24 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఎస్పీ జీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆయా స్టేషన్లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్తో పాటు తిరుపతి జిల్లాకు చెందిన పి.కృష్ణ, పి.చంద్రయ్య, షేక్ ఖాదర్ మస్తాన్, షేక్ అహ్మద్ బాషా, సి.వెంకటేశ్వరరావు జాబితాలో ఉన్నారు.
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ డీఐజీగా ఎ.నాగలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె కాకినాడ నుంచి విజయనగరం బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజిస్ట్రార్గా పని చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని రిజిస్ట్రార్గా కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.
కోడలిని లైంగిక వేధింపులకు గురిచేసిన భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడిన విషయం తెలిసిందే. కోడలు తెలిపిన వివరాలు..’పెళ్లైనప్పటి నుంచే వేధించేవాడు. ఇంట్లో వారికి చెప్పినా పట్టించుకోలేదు. ఆయన పోలికలతో మగ బిడ్డ కావాలని బలవంతం చేసేవాడు’. అదే సమయంలో కట్నం కోసం వేధించడంతో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
అనంతపురం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ పాట్నాలో ఆత్మహత్య చేసుకున్నారు. అందిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన పల్లవీరెడ్డి పాట్నాలోని ఎన్ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో కళాశాల హాస్టల్ భవనంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
విజయవాడ మీదుగా పుదుచ్చేరి(PDY)-హౌరా(HWH) మధ్య ప్రయాణించే 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు రాజమండ్రిలో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు రాజమండ్రిలో ఇచ్చిన ఈ స్టాప్ను పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు నం.12868 PDY-HWH రైలు ఈ నెల 25 నుంచి, నం.12867 HWH-PDY రైలు ఈ నెల 22 నుంచి రాజమండ్రిలో ఆగుతాయన్నారు.
పదేళ్ల క్రితం కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ పంద్యాల వెంకట లక్ష్మమ్మ (38)ను ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఆరుగురికి శిక్ష పడింది. ఆ కేసు విషయంలో విచారణ జరిపిన బద్వేలు కోర్టు ఆధారాలు నిరూపితం కావడంతో ఆరుగురికి శుక్రవారం మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి పద్మశ్రీ శుక్రవారం తీర్పు ఇచ్చారని, కలసపాడు ఎస్సై చిరంజీవి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు సంబంధించిన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని DM&HO డా. బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. CHC సెంటర్ల వద్ద కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే ఈ వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని మంచి వైద్యం అందుతుందన్నారు.
అప్పులపాలైన ఓ యువకుడు ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటనపై నెల్లూరు నవాబుపేట శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరపురంలో పుష్పాంజలి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె కుమారుడు అభినాశ్ బీటెక్ చేశాడు. ఇంటి వద్దనే ఉంటూ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. దీంతో అప్పులపాలయ్యాడు. నగదు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు అధికమవడంతో ఈనెల 18వ తేదీన ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్(Y22 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. నవంబర్ 15 నుంచి 30 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.