Andhra Pradesh

News September 8, 2025

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్‌కు MLA మద్దతు

image

ప్రొద్దుటూరు జిల్లా డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు పలువురి మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆదివారం కలిసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కమిటీ త్వరలో కడప జిల్లా పర్యటనకు వస్తుందని.. అప్పుడు ప్రొద్దుటూరు జిల్లాపై వినతిపత్రం అందజేస్తానని చెప్పారు.

News September 8, 2025

మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.

News September 8, 2025

VZM: రూ.40 లక్షల విలువ చేసే ఎరువులు సీజ్

image

ప్రైవేటుగా అధిక రేట్లకు ఎరువులు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్, పోలీస్ అధికారులతో ముమ్మర తనిఖీలు జరిపించి, అధిక ధరలను అరికడతామని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం తన ఛాంబర్లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 411 చోట్ల తనిఖీలు నిర్వహించి, ఒక FIR నమోదు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.40 లక్షలు విలువ గల 172 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను సీజ్ చేశామన్నారు.

News September 8, 2025

ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

image

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News September 8, 2025

ఒంగోలులో ప్రశాంతంగా ముగిసిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు

image

ఒంగోలులో ఆదివారం అటవీశాఖ పోస్టుల భర్తీకై నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DRO ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 పరీక్ష కేంద్రాలను DRO ఆదివారం సందర్శించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 1153 మందికి గాను 901 మంది హాజరైనట్లు, మిగిలిన పోస్టులకు 7052 మందికి గాను 5642 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు.

News September 8, 2025

VZM: కలెక్టరేట్లో నేడు యధావిధిగా PGRS

image

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం యధావిధిగా PGRS జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 8, 2025

విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

image

విశాఖపట్నం కలెక్టరేట్‌లో 8వ తేదీ (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News September 8, 2025

జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ జరుగుతుంది: కలెక్టర్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ సిబ్బంది అర్జీలను స్వీకరిస్తారన్నారు. https://meekosam.ap.gov.in వెబ్‌సైట్లో ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1100కి ఫోన్ చేసి కూడా తమ అర్జీ సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

News September 8, 2025

రాజమండ్రిలో నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

image

రాజమండ్రిలో నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథాతదంగా జరగనుందని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించుకోవచ్చుని అన్నారు. అర్జీలు ముందుగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.

News September 8, 2025

కడియం: అమోనియా, నానో యూరియాలను రైతులు వాడుకోవాలి

image

కడియం, రాజమండ్రి రూరల్ మండలంలో తూ.గో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నేతల మల్లికార్జున రావు ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలను ఆదివారం పరిశీలించారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియా తగు పరిమాణంలోని మాత్రమే వాడాలని అధికంగా వాడితే పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుందని వారికి చెప్పారు. అమోనియా, నానో యూరియాలను రైతులు తమ పొలంలో వాడుకొని పెట్టుబడి తగ్గించుకోవాలన్నారు.