Andhra Pradesh

News September 21, 2024

‘యూపీఎస్సీ మెయిన్స్‌కు 128 మంది హాజరు’

image

ఎస్‌ఆర్‌ఆర్‌&సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన యూపీఎస్సీ మెయిల్‌ పరీక్షకు ఏడుగురు గైర్హాజరైనట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా తెలిపారు. పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. 135 మంది అభ్యర్థులకు గానూ 128 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. పటిష్ట బందోబస్తు నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని, అభ్యర్ధులకు అవసరమైన మౌళిక వసతులను కల్పిస్తున్నామన్నారు.

News September 21, 2024

రాజంపేట: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్న అభిషేక్ రెడ్డి

image

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల మధ్య గ్లోబల్ లర్నింగ్ అనుభవాలను పెంచుకోవడమే లక్ష్యంగా రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ అభిషేక్ రెడ్డి ఈ నెల 18, 19 తేదీలలో ఫ్రాన్స్ పర్యటన చేశారు. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (EAIE) సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు ఆయనకు “ఫ్లాగ్ బేరర్ ఆఫ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్” అనే సర్టిఫికేట్ అందజేశారు.

News September 21, 2024

VZM: ‘ఈనెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం’

image

ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను శుక్రవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

News September 21, 2024

లడ్డూపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: ఎమ్మెల్యే యరపతినేని

image

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మాచవరం మండలం పిన్నెల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం జంతువుల నూనెతో లడ్డూ తయారు చేశారని, దీనికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News September 21, 2024

23న కాకినాడలో జాబ్ మేళా

image

ఈ నెల 23వ తేదీన కాకినాడ వికాస కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో ఐఅండ్‌వీ బయో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ జాబ్‌మేళాకు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు.

News September 20, 2024

మాజీ సీఎం జగన్ కలిసిన ముద్రగడ

image

మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట తనయుడు ముద్రగడ గిరిబాబు, కిర్లంపూడి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు తదితరులు ఉన్నారు.

News September 20, 2024

రుణాల రీషెడ్యూలింగ్‌ దరఖాస్తులు తక్షణ పరిష్కారం: కలెక్టర్

image

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల నుంచి వస్తున్న రుణాల రీ షెడ్యూల్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలిపారు. పలు బ్యాంకుల అధికారులు, సబ్‌ కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్‌ కేంద్రం ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే 615 ఖాతాలకు సంబంధించి రూ. 51.37 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించారు.

News September 20, 2024

మంత్రి దుర్గేష్ రేపటి పర్యటన ఇలా..

image

మంత్రి కందుల దుర్గేష్ శనివారం కాకినాడలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు కాకినాడ టూరిజం డిపార్ట్‌మెంట్ ఉద్యోగులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడలో టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్స్‌పెక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

News September 20, 2024

కడప: గంజాయి విక్రయాలపై దాడులు

image

కడపలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మాసాపేటలోని హిందూ స్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. వీరి వద్ద నుంచి 4.1 కేజీల గంజాయి, 1000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News September 20, 2024

త్రోబాల్‌ ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లు ఎంపిక

image

రాష్ట్ర స్థాయి త్రో బాల్‌ పోటీలకు ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా త్రో బాల్‌ సంఘం కార్యదర్శి సులోచన తెలిపారు. పురుషుల జట్టుకు రవివర్మ, ప్రమోద్, చరణ్‌తేజ్, చరణ్‌సాయి, యశ్వంత్, రాము, సాయిసంతోష్, రాజ్‌దీప్, జ్యోతివర్మ, అక్షయ్, సూర్య, వెంకటేష్, భాస్కర్, జోసఫ్, అఖిల్, మహిళల జట్టుకు శ్రావణి, జోషిత, సాయిదుర్గ, దక్షిణి, నీరజ, దుర్గ, రితిక ఎంపికైనట్లు చెప్పారు.