Andhra Pradesh

News May 1, 2024

అనంత: నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ

image

అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని తహశీల్దార్లను ఆదేశించారు. కార్డులోని ప్రతి సభ్యునికి 5 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల ఫోర్టిఫైడ్ బియ్యం ఉచితంగా ఇస్తారన్నారు. చక్కెర ఏఏవై కార్డు లకు కిలో రూ.13.50, మిగతా కార్డుదారులకు అర కిలో రూ.17 ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు.

News May 1, 2024

నంద్యాల జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?

image

నంద్యాల జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,89,307మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,80,402మంది, మహిళలు 7,08,647 మంది, ఇతరులు 258 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా నంద్యాల నియోజకవర్గంలో 2,73,938 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116మంది ఓటర్లు ఉన్నారు.

News May 1, 2024

వెలిగండ్ల: బిల్డింగ్ పైనుంచి పడి వ్యక్తి మృతి

image

వెలిగండ్ల మండలం తమ్మినేనిపల్లికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి గుంటూరులో మంగళవారం అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ పైనుంచి జారిపడి మృతి చెందారు. ఈ ప్రమాదంపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సివుంది.

News May 1, 2024

నంద్యాల: ఈ నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు

image

నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణలో 16మంది అభ్యర్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు కేటాయించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.శ్రీనివాసలు తెలిపారు. నంద్యాల ఎంపీ స్థానానికి 31, ఎమ్మెల్యే స్థానాల్లో నందికొట్కూరు 16, బనగానపల్లి 28, శ్రీశైలం 18, ఆళ్లగడ్డ 18, నంద్యాల 28, డోన్ 16మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నందికొట్కూరు, డోన్ మినహ అన్ని స్థానాల్లో రెండేసి ఈవీఎంలు కేటాయించనున్నారు.

News May 1, 2024

చందనోత్సవంపై ప్రత్యేక చర్చ

image

సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విశాఖ పోలీస్ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ నెల 10న జరిగే చందనోత్సవంపై ప్రత్యేకంగా చర్చించారు. ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్ లకు వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో ఆయన ఆయా విభాగాల పనితీరుపై ఆరా తీశారు.

News May 1, 2024

నేడు బొబ్బిలిలో సీఎం జగన్ పర్యటన

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బొబ్బిలిలో జరిగే సభలో ఈరోజు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు బొబ్బిలి మొయిన్ రోడ్డు సెంటర్లో జరిగే ప్రచార సభలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. బొబ్బిలి సభ అనంతరం ఆయన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బయలుదేరి వెళ్తారు.

News May 1, 2024

నేడు పాయకరావుపేటలో జగన్ పర్యటన

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం పాయకరావుపేట రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట సూర్య మహల్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

News May 1, 2024

కొండాపురం: వడదెబ్బతో యువకుడి మృతి

image

కొండాపురం మండలం బురుజుపల్లెకు చెందిన రాచుమల్లు మల్లారెడ్డి (30) వడ దెబ్బతో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన శివమల్లారెడ్డి మంగళవారం ఉదయం తోటకు వెళ్లే దారిలో ఎండ తీవ్రతకు స్పృహ కోల్పోయాడు. తాడిపత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

News May 1, 2024

ఏలూరు: అమ్మవారిని దర్శించుకొని వస్తుండగా తండ్రి, కూతురు మృతి

image

పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం జరిగిన <<13151338>>రోడ్డుప్రమాదం<<>>లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. SI శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన యవ్వారి రుద్రరాము భార్యాపిల్లలతో బైక్‌పై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. రుద్రరాము(33), కుమార్తె రక్షశ్రీ(9) అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదైంది.

News May 1, 2024

ప్రకాశం జిల్లా రాజకీయాలపై నందమూరి బాలకృష్ణ ఆరా

image

ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఒంగోలు వచ్చిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను దామచర్ల జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకేను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై బాలకృష్ణ ఆరా తీసినట్లు తెలిసింది. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.