Andhra Pradesh

News April 30, 2024

విశాఖ: గంజాయి తరలిస్తున్న బాలుడు అరెస్ట్

image

ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా నుంచి విశాఖ మీదగా గంజాయిని తరలిస్తున్న ఒక బాలుడుని ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.80 వేలు వరకు ఉంటుందని జీఆర్పీ సీఐ ధనుంజయ నాయుడు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బాలుడు దగ్గర గంజాయి లభ్యమయింది.

News April 30, 2024

తూ.గో: సోకులేరు వాగులో పడి డ్రైవర్ మృతి

image

రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు మండలం తులసిపాక సమీపంలో ఓ వ్యక్తి మంగళవారం సోకులేరు వాగులో పడి మృతి చెందాడు. మృతుడు నందిగామకు చెందిన కొండయ్య(40)గా గుర్తించారు. మోతుగూడెం SI గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రి నుంచి లారీని నడుపుతూ నందిగామ వస్తున్న కొండయ్య మార్గ మధ్యలో స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. కాలు జారి ఊబిలో పడి ప్రాణాలు విడిచాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 30, 2024

ప్రకాశం: ఉచిత ప్రవేశాలకు 696 మంది ఎంపిక

image

బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశానికి లాటరీ విధానంలో 696 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. వీరిలో బీసీలు 234 మంది, మైనార్టీలు 53 మంది, ఓసీలు 147, ఎస్సీలు 244, ఎస్టీలు 18 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మే 10వ తేదీలోపు సంబంధిత పత్రాలు సమర్పించి ప్రవేశం పొందాలన్నారు.

News April 30, 2024

శ్రీకాకుళం: రూ.1.36 కోట్ల విలువైన బంగారం సీజ్

image

ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు పట్టుబడిన నగదు వివరాలను జిల్లా అధికారులు మంగళవారం వెల్లడించారు. ఎటువంటి పత్రాలు లేకుండా రూ.1,30,18,920 నగదును సీజ్ చేశారు. బంగారం విషయానికొస్తే 2,901 గ్రాముల బంగారాన్ని ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,36,80,284 గా ఉంది. అలాగే 26,581 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.14,41,669 గా ఉంది.

News April 30, 2024

జేఎన్టీయూలో వసతులను పరిశీలించిన ఎస్పీ

image

మండలంలోని కాకాని గ్రామంలో గల జేఎన్టీయూ కళాశాలను ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం పరిశీలించారు. ఎన్నికల అనంతరం కౌంటింగ్‌ను ఇక్కడ నిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఉన్నారు.

News April 30, 2024

చీరాల: బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

image

వేటపాలెం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 30, 2024

ఎమ్మెల్యేని గ్రామాల్లోకి రానివ్వదు: వాకాటి

image

సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఐదేళ్లలో ఏమి పనిచేయని స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను గ్రామాలలో తిరగనివ్వొద్దని, అడ్డుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు వాకాటి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం చెంబేడుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను, నెలవల, పరసా ఏ గ్రామానికి వెళ్లినా ఏమి అభివృద్ధి చేశామో చెప్పగలనని, కానీ కిలివేటి ఏమి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

News April 30, 2024

శ్రీకాకుళం: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ 459 మంది అరెస్టు

image

నగదు, మద్యం, గంజాయి వంటి అక్రమ రవాణా కేసులలో ఇప్పటివరకు 459 మందిని అరెస్టు చేయగా 716 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.. ఇందులో భాగంగా 36 మోటార్ సైకిళ్లు, 13 కార్లు, ఒక వ్యాను, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.87 లక్షలుగా ఉంది. అలాగే సరైన పత్రాలు లేని కారణంగా 13 మొబైల్ ఫోన్లు, 10 చేతి గడియారాలు, 14 చీరలు, పదివేల టీ షర్టులు, 2500 కరపత్రాలు సీజ్ చేశారు.

News April 30, 2024

ఏడు చోట్ల టీడీపీకి హ్యాట్రిక్ ఓటమి

image

చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఏడు చోట్ల హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. తిరుపతి లోక్‌సభ, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, చంద్రగిరి, జీడీ నెల్లూరు, పూతలపట్టులో వరుసగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ 2009లో కాంగ్రెస్ అభ్యర్థులు, 2014, 2019లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. కుప్పంలో చంద్రబాబు వరుసగా ఏడు సార్లు గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు.

News April 30, 2024

అనంత: ఈతకు వెళ్లి ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి

image

కంబదూరులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కంబదూరుకి చెందిన సూర్య, అరుణ దంపతుల ఏకైక కుమార్తె ప్రణీత(14) ఈతకు వెళ్లి మృతి చెందింది. ప్రణీత తన బంధువులతో కలిసి గ్రామ శివారులోని తోటలో ఉన్న ఫామ్ పాండ్‌లో ఈత కొడుతూ ఊపిరాడక మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.