Andhra Pradesh

News April 30, 2024

మంగళగిరి: నవతరం పార్టీ అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ పోలిన గుర్తు

image

నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు ఎన్నికల కమిషన్ గ్లాస్ టంబ్లర్ పోలిన గుర్తు కేటాయించింది. మంగళగిరి, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో సుబ్రహ్మణ్యం పోటీకి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో గాజు గ్లాసును పోలిన గుర్తు కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన అభ్యర్థనకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. సోమవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి రాజకుమారి గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

News April 30, 2024

టీడీపీ నుంచి సివేరి అబ్రహం సస్పెన్షన్

image

అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహంను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా.. అరకు సీటు ఆశించి భంగపడ్డ అబ్రహం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

News April 30, 2024

గుంటూరు: ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం

image

జిల్లాలో సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి గుంటూరు తూర్పులో 1.26 లీటర్ల మద్యం, రూ.54,700 నగదు జప్తి చేశామన్నారు. తెనాలిలో 4.4 లీటర్ల మద్యం, 1,04,000 నగదు, ప్రత్తిపాడులో రూ. 54,700 నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 29వ తేది వరకు రూ.2,55,60,603 ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

News April 30, 2024

కాకినాడ: ‘నేడు ఈ 18 మండలాల్లో వడగాల్పులు’

image

కాకినాడ జిల్లాలోని 18 మండలాల్లో మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం తెలిపారు. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం.. గండేపల్లి, గొల్లప్రోలు, జగ్గంపేట, కాకినాడ రూరల్, కరప, కిర్లంపూడి, కోటనందూరు, ఉప్పాడ కొత్తపల్లి, పెదపూడి, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం, సామర్లకోట, తొండంగి, తుని, ఏలేశ్వరం మండలాల్లో వడగాలులు వీస్తాయన్నారు.

News April 30, 2024

నరసాపురం పార్లమెంట్ బరిలో 21 మంది అభ్యర్థులు

image

నరసాపురం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసే నాటికి 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు.‌ సోమవారం భీమవరం కలెక్టరేట్లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎవరు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీంతో మొత్తం 21 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో నిలిచారన్నారు.‌

News April 30, 2024

నంద్యాల: బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫించన్ల పంపిణీ

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫించన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన లబ్ధిదారులకు డోర్ టు డోర్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులు, మంచానికే పరిమితమైన వారు, అస్వస్థతతో ఉన్నవారు, వృద్ధ మహిళలకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే అందిస్తారని చెప్పారు.

News April 30, 2024

శ్రీకాకుళం: ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పరిశీలన

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమితులైన వ్యయ పరిశీలకులు, నవీన్ కుమార్ సోనీ సోమవారం కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం) ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ ఇంచార్జి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్ని విభాగాలను పరిచయం చేశారు. సీజర్స్, సువిధ, గ్రీవిన్స్ రిడ్రెసల్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది వివరించారు.

News April 30, 2024

ఏజెంట్ల వివరాలు సాయంత్రంలోగా అందించాలి: కలెక్టర్

image

విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టరేట్లో సమర్పించాలని ఆర్ఓ, జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున సూచించారు. ఫారం- 8 ద్వారా రెండు సెట్ల వివరాలు అందజేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల వివరాలు మే 8వ తేదీలోగా, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు మే 25 లోగా అందజేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని పేర్కొన్నారు.

News April 30, 2024

ఎన్నికల్లో హింసను ప్రోత్సహించకండి: అధికారులు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు హింసను ప్రోత్సహించరాదని పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ, పోలీసు పరిశీలకులు అమిత్ శర్మ, అమిత్ కుమార్ లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని నైతిక విలువలు, నిజాయతీతో వ్యవహరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం చిహ్నాల కేటాయింపులో భాగంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

News April 30, 2024

మే 1లోగా పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో జరగనున్న సాధారణ ఎన్నికల విధుల్లో భాగంగా కొత్తగా ఓ.పి.ఓలుగా నియమితులైన వారు మే 1వ తేదీలోగా తమ ప్రాంత తహశీల్దారుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోని ఓపిఓలు ఫారం-12 లో దరఖాస్తులు అందజేయాల్సి వుంటుందన్నారు.