Andhra Pradesh

News April 29, 2024

విశాఖపట్నం పార్లమెంటుకు 33 మంది పోటీ

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 33 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. పరిశీలనలో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, సోమవారం వరకు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. గుర్తింపు పొందిన ప్రధాన పార్టీలకు చెందిన వారు నలుగురు, రిజిస్టర్డ్ పార్టీల నుంచి 14 మంది, 15 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారని చెప్పారు.

News April 29, 2024

విజయనగరం: పసికందు మృతదేహం కలకలం

image

మెంటాడ మండలం ఆండ్రలో సోమవారం చంపావతి బ్రిడ్జిని ఆనుకొని ఉన్న ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన పసికందును పడేసినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దర్యాప్తు చేసి పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఆండ్ర సబ్ ఇన్‌స్పెక్టర్ బొడ్డు దేవి చెప్పారు. తదుపరి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

News April 29, 2024

కుమార్తె సమక్షంలో టీడీపీలో చేరిన తల్లి

image

రాజవొమ్మంగి మండలం గింజర్తి వార్డు మెంబర్ కృష్ణవేణి టీడీపీలో చేరారు. ఆమె వార్డు మెంబర్‌గా గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె శిరీషాదేవి రంపచోడవరం ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డ గ్రామంలో శిరీష తన తల్లికి స్వయంగా టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుమార్తె విజయానికి ప్రచారం చేస్తానని కృష్ణవేణి అన్నారు.

News April 29, 2024

ఫైనల్ లిస్ట్.. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులు వీరే 

image

➣ కింజరాపు రామ్మోహన్ నాయుడు: TDP
➣ తిలక్ పేరాడ: YCP
➣ పేడాడ పరమేశ్వరరావు: కాంగ్రెస్
➣ ఇప్పిలి సీతారాజు : JBNP
➣ నాయుడుగారి రాజశేఖర్ : BSP
➣ కాయ దుర్గారావు : నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
➣బొమ్మాలి తిరుపతి రావు : PPI
➣ బోరుభద్ర చంద్రకళ : BCYP
➣ స్వతంత్ర అభ్యర్థులుగా చెల్లూరి డానియల్, బేత వివేకానంద మహా రాజ్, యెద్దు లక్ష్మీనారాయణ, వాబ యోగేశ్వరరావు, సనపల శ్రవణ్ కుమార్ పోటీలో ఉన్నారు.

News April 29, 2024

చిత్తూరు జిల్లా ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

image

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాలో టీడీపీకి మెజార్టీ సీట్లు రాలేదు. 2009లో కాంగ్రెస్‌కు 7, టీడీపీకి 6, పీఆర్పీకి ఓ స్థానం వచ్చింది. 2014లో వైసీపీకి 8, టీడీపీకి 6 దక్కాయి. 2019లో వైసీపీకి 13 రాగా టీడీపీ కుప్పంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి.

News April 29, 2024

పెన్షన్ల కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు: కలెక్టర్

image

సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎక్కడికి వెళ్ళనవసరం లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. మే 1న పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వికలాంగులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు మంచానికి పరిమితమైన వారి ఇంటి వద్దకే పెన్షన్ నగదు రూపంలో అందించడం జరుగుతుందన్నారు. మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. జిల్లాలో 1,64,899 మంది పింఛన్దారులు ఉన్నట్లు తెలిపారు.

News April 29, 2024

హిందూపురం ఎంపీ అభ్యర్థులుగా 13మంది బరిలో

image

హిందూపురం ఎంపీ అభ్యర్థులుగా 13మంది బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉపసంహరణ అనంతరం పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 15మంది అభ్యర్థులు బరిలో ఉండగా సోమవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారని తెలిపారు.

News April 29, 2024

పల్నాడు జిల్లాలో 14 నామినేషన్లు ఉపసంహరణ

image

జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గానూ 14 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. సోమవారం జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందన్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి నలుగురు, చిలకలూరిపేట ఒకరు, నరసరావుపేట అసెంబ్లీకి ఇద్దరు, సత్తెనపల్లి ఐదుగురు, వినుకొండ ఇద్దరు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు.

News April 29, 2024

నెల్లూరు పార్లమెంట్ బరిలో 14 మంది

image

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ అనంతరం అధికారిక జాబితా విడుదల చేశారు. మొత్తం 15 నామినేషన్‌లో ఉండగా వారిలో ఒకరు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో 14 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మధ్య పోటీ నెలకొని ఉంది.

News April 29, 2024

బాపట్ల జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఇదే..

image

బాపట్ల జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి 151 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, చివరగా 104 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. బాపట్ల పార్లమెంటు నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. అసెంబ్లీల వారీగా వేమూరు 15, రేపల్లె 14, బాపట్ల 15, పర్చూరు 15, అద్దంకి 15, చీరాల 15 మంది అభ్యర్థులు రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.