India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప నగరంలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాలాజీ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విద్యుత్ షాక్కు గురై రాజారెడ్డి వీధికి చెందిన సుమ తేజ (పండు) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు
☞ కృష్ణా జిల్లాలో వర్షానికి నష్టపోయిన చిరు వ్యాపారులు
☞ హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత
☞ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కృష్ణాజిల్లా ఉపాధ్యాయులు
☞ ఈనెల 30ను గుడివాడలో జాబ్ మేళా
రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం విశాఖ రానున్నారు. గురువారం రాత్రి 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని సర్క్యూట్ హౌస్లో బస చేస్తారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబుతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 11:10 కి విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో విజయవాడ బయలుదేరి వెళ్తారు.
సీఎం చంద్రబాబు ఈనెల 29న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పరిశీలించారు. భద్రతాపరమైన అంశాలపై పోలీస్ కమిషనర్తో చర్చించారు. అనంతరం రుషికొండ రాడిసన్ రిసార్ట్ను సందర్శించి అక్కడ జరగబోయే గ్రిఫిన్ నెట్వర్కింగ్ మీటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. గ్రీన్ రూమ్, ప్రధాన సమావేశం జరిగే ప్రాంతాలను పరిశీలించారు.
ఎక్స్ వేదికగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి బుధవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, కొంతమంది ప్రముఖులు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు పేరున రీ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని కృష్ణదొడ్డికి చెందిన గోపాల్, పుణ్యవతి దంపతుల కుమారుడు కోదండరాముడు గత 8ఏళ్లుగా ఆర్మీలో సైనికునిగా పనిచేశారు. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏపీ మెగా DSCలో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 86.07 మార్కులు సాధించారు. దీంతో జిల్లాలో 2వ ర్యాంక్, స్టేట్లో 13వ ర్యాంక్ రాగా SGTలో 87.77 మార్కులతో జిల్లా 94వ ర్యాంక్తో 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
మెగా DSC-2025 మెరిట్ జాబితా అభ్యర్థులకు DEO కిరణ్ కుమార్ బుధవారం సూచనలు చేశారు.
➤మెరిట్ జాబితా AP-DSC వెబ్సైట్లో చూసుకోవాలి.
➤రేపటి నుంచి ఒంగోలు సరస్వతి జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్.
➤అభ్యర్థులు లాగిన్ ఐడీతో కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
➤5 ఫొటోలు, 3సెట్ల జిరాక్సులు, ఒరిజినల్ పత్రాలు తేవాలి.
➤సూచించిన తేదీలో హాజరు కాకుంటే అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
NOTE: సందేహాలుంటే కామెంట్లో తెలపండి.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీనియర్ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ఇటీవల ఉత్కంఠంగా ముగిసిందని కడప జిల్లా అధ్యక్షుడు ఎం. డేనియల్ ప్రదీప్ తెలిపారు. ఫైనల్లో కడప జిల్లా ఫుట్ బాల్ అసోషియేషన్ జుట్టు అనంతపురం జట్టుతో తలపడిందన్నారు. రెండు జట్లు మధ్య మ్యాచ్ పూర్తి సమయానికి 0-0తో డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుట్కు వెళ్లింది. కీలకమైన షూట్ అవుట్లో అనంతపురం జిల్లా జట్టు 3-2 తేడా విజయం సాధించిందన్నారు.
పుంగనూరులో బుధవారం జరిగిన బైక్ యాక్సిడెంట్లో ఓ మహిళ మృతి చెందింది. సింగరిగుంట గ్రామానికి చెందిన భార్య,భర్తలు బోయకొండ, సుజాత పుంగనూరు నుంచి సింగరిగుంటకు బైక్పై వెళ్తున్నారు. రెడ్డివారి బావి వద్ద వాహనంపై నుంచి సుజాత జారి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రురాలను తిరుపతి రుయా ఆసుపత్రికి ఓ అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలోని రొంపిచర్ల వద్ద మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.