Andhra Pradesh

News April 29, 2024

తూ.గో.: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భట్నవిల్లి వద్ద లారీ- ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు యువకులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యానాంలో పుట్టినరోజు వేడుకులు నిర్వహించుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు సాపే నవీన్, జతిన్, నవీన్ కుమార్, అజయ్‌ మామిడికుదురు మండలవాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 29, 2024

ప.గో.లో 2 రోజులు పవన్ పర్యటన

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ప.గో. జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నారు. సోమవారం పిఠాపురం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గణపవరం చేరుకొని పోలీస్ ఐల్యాండ్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిప్పర, చిటకంపాడు లాకులు మీదుగా రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకొని అక్కడ సభలో పాల్గొంటారు.

News April 29, 2024

విశాఖలో సీఎం జగన్ పర్యటన … షెడ్యూల్ ఇదే..!

image

సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.

News April 29, 2024

విశాఖలో సీఎం జగన్ పర్యటన … షెడ్యూల్ ఇదే..!

image

సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.

News April 29, 2024

విజయవాడ: ఉరివేసుకొని ఆత్మహత్య.. కేసు నమోదు

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కాటూరు నరేంద్ర(36)కృష్ణలంక గుంటూరి వారి వీధిలో ఉంటూ లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, భార్య నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో నరేంద్ర ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.

News April 29, 2024

సీఎం జగన్ నేటి పొన్నూరు పర్యటన వివరాలు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పొన్నూరుకు వస్తున్నారు. పి. గన్నవరం నుంచి హెలికాఫ్టర్‌లో మధ్నాహ్నం 3 గంటలకు స్థానిక జీబీసీ రహదారిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఎన్నికల ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.

News April 29, 2024

ప్రకాశం జిల్లాకు రానున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 3వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇటీవల ఒంగోలు కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు చేపట్టే ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.

News April 29, 2024

అనంతలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

image

ఉమ్మడి అనంత జిల్లాలో ఆదివారం అనంత నగరంలో రికార్డు స్థాయిలో 44.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, నారాయణస్వామి తెలిపారు. బుక్కరాయసముద్రంలో 43.2, తాడిపత్రి, నంబులపూటకుంట, పుట్టపర్తి 40.5, తనకల్లు, గోరంట్లలో 40.4 డిగ్రీలు చొప్పున  ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

News April 29, 2024

తెర్లాం: చికిత్స పొందుతూ VRO మృతి

image

బాడంగి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న రాజయ్యపేటకుగ్రామానికి చెందిన ఏవీఎస్ డీకే రాజు (58) ఆదివారం మృతి చెందారు. ఇటీవల విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖలో చికిత్స పొందుతూ , ఇతర అనారోగ్య సమస్యలతో పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు వీఆర్వోల సంఘం సంతాపం ప్రకటించింది.

News April 29, 2024

ప.గో.: ACCIDENT.. ఇద్దరు మృతి

image

కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఏలూరుకు చెందిన వినోద్ కుమార్ సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటుచేసే పనిచేస్తుంటారు. పనిలో భాగంగా 8మందితో వ్యాన్‌లో ఆదివారం అనకాపల్లి బయలుదేరారు. కాపవరం వద్దకు రాగానే వీరివాహనం ముందువెళ్తున్న లారీని ఢీకొంది. వినోద్‌, ప్రభాకర్(21) అక్కడికక్కడే మరణించారు. మిగతా వారికి గాయాలయ్యాయి. కేసు నమోదుచేసినట్లు కొవ్వూరు గ్రామీణ SI సుధాకర్ తెలిపారు.