India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతీ పౌరుడి బాధ్యత అని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ నుంచి అంగన్వాడీ కేంద్రాలు, ఇరిగేషన్ అంశాలకు సంబంధించి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్పై సంబంధిత శాఖల జిల్లా అధికారులలో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.

జమ్మలమడుగు పట్టణంలోని CSI క్యాంప్బెల్ హాస్పిటల్ పురాతనమైనది. అయితే ఈ హాస్పిటల్ 1891వ సంవత్సరంలో జమ్మలమడుగులో నిర్మితమైంది వైద్య సేవల చరిత్రలో CSI క్యాంప్బెల్ ఆసుపత్రికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ దాదాపు 100 సంవత్సరాల నాటి ఫొటో బయటపడింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా డాక్టర్ అగస్టిన్ రాజ్ ఉన్నారు.

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా హైదరాబాద్ (చర్లపల్లి)-తిరువనంతపురం నార్త్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రైలు నెల్లూరు మీదుగా వెళ్లనుంది. నెల్లూరుకు ఉదయం 5:43కు రానున్న ఈ రైలు 5.45AMకు బయలుదేరి 4:30 PMకు చర్లపల్లి చేరుకోనుంది. ఉదయాన్నే నెల్లూరు నుంచి HYD వెళ్లాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది.

అరసవెల్లి దేవస్థానంలో ఈ నెల 24న జరగనున్న రథసప్తమి ఉత్సవాలలో భక్తులు దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత దర్శనం, రూ.100 దర్శనం, రూ.300, వీఐపీ దర్శనాలు కోసం ఒక్కోదానికి రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీ దర్శనాలను ఉత్తర ద్వారం ద్వారా పంపించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి మీడియా పాయింట్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు.

దుగ్గిరాల(M) చిలువూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ప్రియురాలు సహా ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మృతుడి భార్య లక్ష్మి మాధురి, ప్రియుడు గోపిలను దుగ్గిరాల ఎస్సై వెంకట రవి విచారిస్తున్నారు. భర్తను చంపిన తర్వాత డెడ్బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. దిండుతో ఊపిరాడకుండా హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నమ్మబలికిన విషయం తెలిసిందే.

రీసర్వేలో పలు లోటు పాట్లు చోటు చేసుకుంటుండడంతో వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇందులో రైతులను భాగస్వామ్యం చేసింది. రీ సర్వే ప్రారంభంలోను, ముగిసిన తర్వాత రైతుల ఈ కేవైసీ తీసుకోవాలని ఆదేశించింది. తద్వారా తప్పులు రైతులు గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాలుగో విడత రీ సర్వే పలుచోట్ల నిర్వహిస్తున్నారు. 101 గ్రామాలలో 1.15 లక్షల ఎకరాలలో రీ సర్వేను రెవెన్యూ అధికారులు చేపట్టనున్నారు.

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టారు. ఈ నెల 21 నుంచి 31వతేదీ వరకు సెలవులో ఉంటారని అధికారులు తెలియజేశారు. జేసీగా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో బుధవారం 81 గ్రామాల్లో ఉచిత పశు వైద్యశిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. 825 పశువులకు సంతాన సాఫల్య చికిత్సలు, 130 పశువులకు కృత్రిమ గర్భధారణ, 136 పశువులకు కృత్రిమ లింగ నిర్ధారణ వీర్యంతో గర్భధారణ తదితర చికిత్సలను అందజేశామన్నారు. పాడి రైతులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.