Andhra Pradesh

News October 4, 2024

ATP: మ్యారేజ్ బ్యూరో మోసం.. పెళ్లి సంతోషం 15 రోజులే!

image

హిందూపురం మం. రాచపల్లికి చెందిన వేమారెడ్డి మ్యారేజ్ బ్యూరో చేతిలో మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె సొంతూరు భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.

News October 4, 2024

ప్రకాశం: ‘ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి’

image

ప్రకాశం జిల్లాలో ఇసుక భూములకు సంబంధించి పట్టాదారులు, డీకేటీ పట్టాదారులు ఇసుక తవ్వకాల అనుమతి కోసం తరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టెట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు, రవాణా సంబంధిత సరిహద్దు గ్రామాల పరిధిలో జరగాలన్నారు. ప్రక్రియకు స్థానిక వీఆర్‌ఓ, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు బాధ్యత వహించాలన్నారు.

News October 4, 2024

ప.గో: మ్యారేజ్ బ్యూరో మోసం.. పెళ్లి సంతోషం 15 రోజులే!

image

భీమవరానికి చెందిన యువతిని సత్యసాయిజిల్లాకు చెందిన వేమారెడ్డి పెళ్లి చేసుకొని మోసపోయాడు. 44 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఆయన మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి రూ.3 లక్షలు చెల్లించారు. వారు చూపించిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 15 రోజులకు ఆమె భీమవరం వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బ్రోకర్లు కొన్నిరోజులు ఉండి వచ్చేయమన్నారని యువతి చెప్పడం గమనార్హం.

News October 4, 2024

ప్రకాశం: ‘బాణసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత శుక్రవారం తెలియజేశారు. ఆసక్తికలిగిన వారు తాత్కాలిక లైసెన్స్‌ కోసం ఈనెల 15లోగా మీసేవ కేంద్రాలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తహశీల్దార్లు, పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి దీపావళి బాణసంచాను విక్రయించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.

News October 4, 2024

రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ వీపీఆర్ చర్చ

image

విజయవాడలోని సత్యనారాయణపురం ఈటీటీ సెంటర్‌లో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశం శుక్రవారం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశానికి హాజరై పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో దుస్థితిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నడికుడి రైల్వే లైను తదితర అంశాలపై చర్చించారు.

News October 4, 2024

కడప: YCPకి మాజీ మంత్రి కుమారుడి రాజీనామా

image

జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం వైసీపీకి రాజీనామా చేశారు. ఇతను మాజీ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి స్వయానా పెదనాన్న కుమారుడు. ఈయన గడిచిన ఎన్నికల్లో కూడా వైసీపీ పక్షాన క్రియాశీలకంగా వ్యవహరించారు. హర్షవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.

News October 4, 2024

పెన్నా నదిలో యువతి మృతి

image

నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఈరోజు ఉదయం రంగనాయకుల స్వామి గుడి వెనుక నదిలో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె బుర్కా ధరించి ఉన్నారు. సుమారు 18 నుంచి 20 ఏళ్ల లోపు వయస్సు ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన వాళ్లు నెల్లూరు సంతపేట పోలీసులను సంప్రదించాలని కోరారు.

News October 4, 2024

ATP: ఎద్దుల బండిపై నుంచి పడి బాలుడి మృతి

image

అనంత జిల్లా కణేకల్లు మండల కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. కురుబ జశ్వంత్ (6) అనే బాలుడు ఎద్దుల బండిపై నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సెలవులు కావడంతో తండ్రితోపాటు శుక్రవారం ఉదయం ఎద్దుల బండిపై పొలానికి వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.

News October 4, 2024

కడప: అధికారుల పేరుతో నగదు వసూలు.. తస్మాత్ జాగ్రత్త

image

కడప జిల్లాలో ఉన్నతాధికారుల పేరుతో సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నాడని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శివ శంకర్ సూచించారు. ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల పేరు, ఫోటో పెట్టి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించి అత్యవసరంగా డబ్బు పంపాలని మెసేజ్‌లు పంపిస్తున్నారన్నారు.
ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ డబ్బు కానీ పంపాలని ఎప్పుడు అడగరనేది తెలిపారు.

News October 4, 2024

విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

image

విజయవాడ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన రామవరప్పాడు రింగ్-మహానాడు రోడ్డు వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బెంగళూరులో ఇటీవల నిర్మించిన ఈ తరహా ఫ్లైఓవర్ మాదిరిగా 6.5కి.మీ. మేర మహానాడు రోడ్డు-నిడమానూరు వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ఫ్లైఓవర్‌లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ సైతం నిర్మించనున్నట్లు సమాచారం.