India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 34 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించి, సక్రమంగా లేని 13 నామినేషన్లను రిజెక్ట్ చేశామన్నారు. పరిశీలనలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు S.P. కార్తీకా పాల్గొన్నారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన సోమల మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సదుం మండలం కారేవాండ్ల పల్లెకు చెందిన ముని-వెంకట సిద్ధుల కుమారుడు భవిత్ కుమార్(15) మండలంలోని నడింపల్లిలో సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో నేడు ఈత కోసం గుంజు చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పిఠాపురంలో చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరరావు ఎన్నికల బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిన్ని నామినేషన్ వేశారు. ఇంటర్ వరకు చదివిన ఆయన స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఏ (రాజనీతిశాస్త్రం) సైతం పూర్తిచేశారు. నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే ఓ మేనిఫెస్టో రూపొందించుకొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ బషీద్కి బీఫామ్ ఇవ్వగా ఆయన నామినేషన్ వేశారు. అయితే అనూహ్యంగా నిన్న చివరి నిమిషంలో ఆయనను తప్పించి తెనాలి స్థానికుడైన డాక్టర్ చందు సాంబశివుడిని ప్రకటించింది. ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా నేడు అధికారులు వారి ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు.
చీపురుపల్లి నియోజకవర్గానికి 1985లో జరిగిన ఎన్నికల్లో వింత ఘటన జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీసాల నీలకంఠం నాయుడికి అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బీఫాం కొంత ఆలస్యంగా రావడంతో సకాలంలో నామినేషన్ వేయలేకపోయారు. ఆయనను EC స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి విమానం గుర్తుఇచ్చింది. దీంతో ఆయన విమానం, హస్తం గుర్తులను బ్యానర్పై వేయించి ప్రచారం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
4 రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో జనాలు రోడ్డు మీదికి రావడానికి భయపడుతున్నారు. జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజంపేట, చిట్వేల్, దువ్వూరు, ముద్దనూరు, పెనగలూరు, పుల్లంపేట, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల్లో 44 డిగ్రీలు, చెన్నూర్, పెండ్లిమర్రిలో 43 డిగ్రీలు, గాలివీడు, లింగాల, మైలవరం, సంబేపల్లెలో 42 డిగ్రీలు, రాజుపాలెం 41, తొండూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సాధారణ ఎన్నికలు-2024 జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పార్లమెంట్, నియోజకవర్గ అభ్యర్థుల నామినేషన్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థితో కలిసి కలెక్టర్ నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు.
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవి శంకర్ అయ్యన్నార్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవి శంకర్ అయ్యన్నార్కు ఫిర్యాదు చేశారు.
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జ్ డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో దాతల సహకారంతో గతంలో ఆర్వో ప్లాంట్ నిర్మించి పంచాయతీకి అప్పగించినా ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో మీటర్ కాలిపోయింది. దాని మరమ్మతుల కోసం ఓ మంత్రి జోక్యం చేసుకోవడం, అధికారుల మధ్య కోల్డ్ వార్ నేపథ్యంలో ప్లాంట్ వివాదం ముదిరింది.
రాష్ట్రవ్యాప్తంగా MA, M.COM, MSC తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న APPGCET దరఖాస్తు గడవు మే 4వ తేదీతో ముగియనుందని కన్వీనర్ ఆచార్య జీ శశిభూషణరావు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అపరాధ రుసుముతో మే 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.