India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో.జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గురువారం 67 మంది అభ్యర్థులు 73 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 122 మంది అభ్యర్థులు 206 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు కలెక్టర్ తెలిపారు. భీమవరంలో 8 మంది, తాడేపల్లిగూడెంలో 15 మంది , నరసాపురంలో 7, ఆచంటలో 8, తణుకులో 6, ఉండిలో 10 , పాలకొల్లులో 13 మంది దాఖలు చేశారు.
పెదకాకానిలో విషాదం చోటు చేసుకుంది. మసీదు సెంటర్ వద్ద షేక్ ముస్తాఫా (35) శుక్రవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద మంచినీరు పట్టేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు డెక్కన్ టుబాకో కంపెనీలో కార్మికుడిగా పని చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. శుక్రవారం ఎన్నికల అధికారులు ఈ నామినేషన్లను పరిశీలించి నిబంధనలు పాటించని వాటిని తిరస్కరిస్తారు. 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు వుంది. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో యోగా, ఫిట్నెస్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహిస్తున్న ఏడాది యోగా పీజీ డిప్లమా కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత గురువారం తెలిపారు. జూన్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 27లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఈనెల 26, 27, 28 తేదీల్లో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజోలులోని మలికిపురం కూడలిలో.. 6 గంటలకు ద్రాక్షారామ సుభాష్చంద్రబోస్ కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం పెద్దాపురం, కాకినాడ గ్రామీణంలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. 28న జగ్గంపేట, ప్రత్తిపాడు సభల్లో పాల్గొంటారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోనసీమ , కాకినాడ , రాజమండ్రి పార్లమెంటు ఆయా పరిధిలోని 21 అసెంబ్లీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ పార్లమెంట్లకు 32, రాజమహేంద్రవరం పార్లమెంటు 19, అమలాపురం పార్లమెంటు 21 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 21అసెంబ్లీ స్థానాలకు గాను కాకినాడ జిల్లా 170, తూర్పు గోదావరి జిల్లా 114 డా.బి.ఆర్. కోనసీమ జిల్లా 175 నామినేషన్లు దాఖలయ్యాయి .
ఏలూరు నగర శివారు చాటపర్రుకు చెందిన ఈదుపల్లి పవన్ పోతురాజు (28) లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. ఇతను గురువారం లారీలో వెళుతుండగా కొమడవోలు వద్ద వేరే లారీని తప్పించే క్రమంలో ఆ వాహనం డోర్ తగిలి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు పోతురాజును సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
యర్రగొండపాలెంలో టీ కొట్టు యజమాని శ్రీను త్రిపురాంతకం రోడ్ సెంటర్లో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగ్గా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలను పరిశీస్తున్నారు. ఆ ప్రదేశంలో అచ్చు బొమ్మ ఆడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మరోసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. 30వ తేదీ మైదుకూరులో ఎన్నికల సభ నిర్వహించనున్నారు. కాగా గురువారం పులివెందులలో జగన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనకు YCP శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జగన్ సొంత ఇలాఖాలో మరోసారి పూర్తి పట్టు సాధించాలని చూస్తున్నారు. అటు టీడీపీ కూడా ఈసారి కడప జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాపాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం డాన్ గంగిరెడ్డితో మిథున్ రెడ్డి తిరుగుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డు వస్తున్నారని 40 మందిని చంపేశారు. మరికొందరి కాళ్లు, చేతులు నరికేశారు. ఆస్పత్రుల్లో ఇంజెక్షన్లతో చంపేస్తున్నారు. యువత ఎదురు తిరిగితే జగన్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రోడ్ల మీదకు రాగలరా..?’ అని పవన్ ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.