Andhra Pradesh

News April 26, 2024

కృష్ణా: ఒకే పేరుతో పలు నామినేషన్లు

image

మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేరు కలిసేలా Ch బాలశౌరి అనే వ్యక్తి, YCP MP అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు పేరు కలిసేలా రావూరి చంద్రశేఖర్, అన్నే చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. పెడన TDP అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేరు కలిసేలా కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్, గుడివాడ YCP అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పేరు కలిసేలా వెంకటేశ్వరావు కొడాలి అనే వ్యక్తి పేరిట నామినేషన్లు దాఖలయ్యాయి.

News April 26, 2024

తిరుపతి ఎంపీగా పోటీ చేసిన నేత మృతి

image

టీడీపీ నేత కారుమంచి జయరాం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న చనిపోయారు. పోలీసు శాఖలో పని చేసిన ఆయన రిటైర్‌మెంట్ తీసుకుని పొత్తులో భాగంగా 2014లో BJP తిరుపతి MP అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో YCP అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు TDPలో చేరారు. రేణిగుంట(M) అత్తూరులో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News April 26, 2024

ప్రకాశం: ఆ మండలం నుంచి ఆరుగురు MLA అభ్యర్థులు

image

దేశంలోనే పొగాకు వ్యాపారానికి టంగుటూరు మండలం ప్రసిద్ధి. ఇక్కడి నుంచి వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు MLA అభ్యర్థులు ఉన్నారు. బాలినేని, దామచర్ల జనార్దన్ ఇద్దరిది ఈ మండలమే. వీరిద్దరూ ఒంగోలు నుంచి తలపడుతున్నారు. బుర్రా మధుది టంగుటూరులోని శివపురం. MLA డోలా వీరాంజనేయ స్వామిది తూర్పు నాయుడుపాలెం. తాటిపర్తి ఇక్కడివారే. వరికూటి అశోక్ బాబు కారుమంచిలో పుట్టి పెరిగారు. అటు గంటా శ్రీనివాసరావుది జరుగుమల్లి మం.

News April 26, 2024

రాజమండ్రి: నేటి నుంచి ఆ మార్గం బంద్

image

రాజమండ్రి-కొవ్వూరు మధ్య ఉన్న గామన్‌ బ్రిడ్జి మరోసారి మరమ్మతులకు గురైంది. రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వచ్చే మార్గంలో 28వ స్తంభం వద్ద అమర్చిన బేరింగ్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు సమాచారం. బేరింగ్‌ మార్పు చేయడానికి 10 రోజుల పాటు వంతెనపై ఒక మార్గంలోనే వాహన రాకపోకలకు అనుమతించనున్నారు.

News April 26, 2024

భీమిలిలో అత్యధిక ఓటర్లు.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

image

భీమిలి నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 3,60,507 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వీరిలో పురుషులు 1,76,860, స్త్రీలు 1,83,632,ఇతరులు 15 మంది కలరు. విస్తీర్ణంలోని పెద్దదిగా గుర్తింపు పొందింది. భీమిలితో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలు, ముఖ్యంగా మధురవాడ నియోజకవర్గంలో కలవు. ప్రముఖ సందర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

News April 26, 2024

విజయనగరం మండలంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

విజయనగరం మండలంలో గురువారం మధ్యాహ్నం ఆటో, బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. జామి నుంచి విజయనగరం వైపు వస్తున్న బస్సు రామనారాయణం వద్ద టీపాయింట్ సమీపంలో కొత్త భీమసింగి వైపు వెళ్తున్న ఆటోను, ఆ వెనుకే వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. మృతులు పద్మనాభం మండలం చిన్నాపురానికి చెందిన యు.లలిత(35), జామి మండలం కొత్త భీమసింగికి చెందిన పి.శశికుమార్‌గా గుర్తించారు.

News April 26, 2024

సాగర్ కుడి కాలువకు నీటి నిలుపుదల

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు గురువారం నీటిని నిలుపుదల చేశారు. కుడికాలువ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగు నీటి అవసరాల నిమిత్తం ఈనెల 8న కృష్ణా యాజమాన్య బోర్డు 8టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తవ్వడంతో కేఆర్ఎంబీ ఈఈ రఘునందన్ సమక్షంలో ఉదయం 8.30 గంటలకు గంటకు 1,000 క్యూసెక్కుల చొప్పున తగ్గిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు నీటిని పూర్తిగా నిలిపివేశారు.

News April 26, 2024

ఈనెల 29న చోడవరంలో సీఎం జగన్ బహిరంగ సభ

image

ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28న తాడిపత్రి నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారని, ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. 29న చోడవరంలో ఉదయం పది గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారన్నారు.

News April 26, 2024

కోటబొమ్మాళి: ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

image

కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను(18) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చీపుర్లపాడు పంచాయతీ దుర్గంపేటకు చెందిన చిదపాన శ్రీనును సీతన్నపేట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

News April 26, 2024

కడప: వివాహిత అనుమానాస్పద మృతి

image

ఒంటిమిట్ట సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న సాయికుమార్, రాచగుడిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై తండ్రి లింగన్న కుమారుడిని మందలించాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం ‘మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని’ సాయికుమార్ తండ్రి లతిక తండ్రికి ఫోన్ చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.