India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వట్టిచెరుకూరు, చేబ్రోలు సమీప గ్రామాలలో అమరావతి ORR భూసేకరణ ప్రారంభమైంది. కేంద్రం ఆమోదంతో వెడల్పు 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెరిగింది. ఇది అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలిలను రెండు లింక్ రోడ్లతో కలుపుతుంది. అమరావతికి వడ్డాణంలా ఈ రింగ్ రోడ్డు ఏర్పడనుంది. ఓఆర్ఆర్ నిర్మాణ వ్యయం మొత్తం రూ.16,310 కోట్లుగా అంచనా వేశారు.
విజయనగరంలోని ఓ హోటల్లో టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటుపై త్రిసభ్య కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఫరూఖ్, ఎమ్మెల్యే గణబాబు సభ్యులుగా వ్యవహారించి నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కోరారు.
నిర్మాణాలు పూర్తయిన MPFC (మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్) గోదాముల బిల్లులు చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలు పూర్తయిన 11 గోదాములకు చివరి పేమెంట్ కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. పనులు మొదలుకాని గోదాములకు అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు.
తణుకులో మంగళవారం జరిగిన ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ అండర్–17 బాలుర, బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ ఎంపికల్లో 18 మంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పశ్చిమ గోదావరి ఫెన్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ గుణ్ణం కృష్ణమోహన్ తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుంచి 60 మంది పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 30న శనివారం భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. తన ఫొటోలు వాడి ఇతరులను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఫేక్ హ్యాకర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.
సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కి హాజరవుతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.
తెనాలికి చెందిన సినీ మాటల రచయిత, నంది అవార్డు గ్రహీత సాయి మాధవ్ బుర్రా ‘సినీ సంభాషణా శిల్పి’ బిరుదును పొందారు. అమెరికాలోని డల్లాస్లో ఈ నెల 24న తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతినిధులు సాయి మాధవ్ కు ఈ బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. తెనాలిలో కళాకారుల కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే రంగస్థలం నటుడిగా గుర్తింపు పొందారు. RRR సహా పలు సినిమాలకు సంభాషణలు రాసిన సాయి మాధవ్ నంది అవార్డులు కూడా పొందారు.
వినాయక చవితిని ప్రశాంతంగా, ఆనందంగా చేసుకోవాలని SP కృష్ణ కాంత్ ప్రజలకు సూచించారు. పోలీస్ శాఖ సూచనలు, ఆదేశాలు తప్పని సరిగా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన తెలిపారు.
సోలార్ యూనిట్ల స్థాపనలో విద్యుత్ అధికారులు వారి లక్ష్యాలను సాధించాలని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఏఏ బ్యాంక్ల వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉన్నదీ జాబితా తీసుకొని పరిష్కరించాలని ఎస్.ఈకి సూచించారు. PM సూర్యఘర్ పథకంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉందని, గత 3 నెలల్లో ప్రగతి ఆశాజనకంగా ఉందని జేసీ అభినందించారు.
GVMC పరిధిలో రూ.1015 కోట్ల అభివృద్ధి పనులకు అక్టోబరులోగా టెండర్లు పిలవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదేశించారు. అమరావతిలో మంగళవారం జీవీఎంసీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలన్నారు.మూడునాలుగేళ్లలో ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా జోన్ల పునర్వ్యవస్థీకరణ ఉండాలని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.