Andhra Pradesh

News April 26, 2024

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: ఎన్నికల పరిశీలకులు అమిత్ శర్మ

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అధికారులందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా అధికారులను విశాఖపట్టణం లోక్ సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, పోలీసు పరిశీలకులు అమిత్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సాహసంతో కూడుకున్నదని జాగరూకత వహిస్తూ ముందుకు సాగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తూ.చా పాటించాలన్నారు.

News April 26, 2024

CTR: 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆధ్వర్యంలో పాలిసెట్-2024 పరీక్ష ఈనెల 27న నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ జేమ్స్, ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరులో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కుప్పంలో 561 మంది, పలమనేరులో 1243 మంది విద్యార్థులు హాజరుకానుట్లు చెప్పారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు.

News April 26, 2024

పల్నాడు: జిల్లాలో ఏడో రోజు 89 నామినేషన్లు 

image

జిల్లాలో ఏడవ రోజు గురువారం మొత్తం 89 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్‌కు 11, నరసరావుపేట అసెంబ్లీకి 14, పెదకూరపాడు అసెంబ్లీకి 10, చిలకలూరిపేట అసెంబ్లీకి11 సత్తెనపల్లి అసెంబ్లీకి 9, వినుకొండ అసెంబ్లీకి 12, గురజాల అసెంబ్లీకి 13, మాచర్ల అసెంబ్లీకి 9 నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. 

News April 26, 2024

NTR: ఎన్నికల పరిశీలకుడిగా న‌రీంద‌ర్ సింగ్ బాలి

image

జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ, మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సాధార‌ణ పరిశీలకులుగా విచ్చేసిన ఐఏఎస్ అధికారి న‌రీంద‌ర్ సింగ్ బాలితో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు గురువారం భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లోని మునిసిప‌ల్ గెస్ట్ హౌస్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా వారిని క‌లిసి పుష్ప గుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

News April 25, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల నిబంధనలు ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో 08514-293917, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 08514-293910, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ అబ్జర్వర్ హిమాన్సు శంకర్, 08514-293913 నంబర్లకు ఫిర్యాదులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

చంద్రబాబుకు సాదర వీడ్కోలు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట, కోడూరు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. వాళ్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

News April 25, 2024

27న పెద్దాపురానికి పవన్ కళ్యాణ్

image

పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 27న వస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని, పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ నేతలు పాల్గొంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు చేపట్టినట్లు టౌన్ అధ్యక్షులు అడబాల కుమార్ స్వామి తెలిపారు.

News April 25, 2024

ఏలూరు: రేపటినుండి నామినేషన్ల పరిశీలన

image

ఏలూరు జిల్లాలో గురువారం మొత్తం 71 నామినేషన్లు దాఖలయ్యాయని శాఖ అధికారులు తెలిపారు. వీటిలో పార్లమెంట్ కు 10 సెట్లు, అసెంబ్లీకి 63 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటల నుండి అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు. అటు ఏలూరు పార్లమెంట్, ఏలూరు, నూజివీడు, కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం అసెంబ్లీ పరిధిలో నామినేషన్లు పడ్డాయన్నారు.

News April 25, 2024

విజయవాడ: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసిన సీపీ రామకృష్ణ

image

విజయవాడ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. విజయవాడలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీకి సూచనలు చేశారు.

News April 25, 2024

శ్రీకాకుళంలో నామినేషన్ల వివరాలు

image

శ్రీకాకుళం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు, పార్టీలకు చెందిన అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.1.కాయ దుర్గారావు, 2.బేత వివేకానంద మహరాజ్, 3.BYC పార్టీ నుంచి బోరుభద్ర చంద్రకళ, 4.శ్రవణ్ కుమార్, 5.PPI పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా కారి లక్ష్మణ్ గురువారం ఉదయం నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.