Andhra Pradesh

News April 25, 2024

ఓపెన్ టెన్త్‌లో ఫలితాల్లో శ్రీకాకుళం 17వ స్థానం

image

ఓపెన్ స్కూల్, టెన్త్ & ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో టెన్త్ పరీక్షలకు 767 మంది హాజరుకాగా 280 (36.51) శాతం మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 1705 మందికి 561 (32.90%) మంది ఉత్తీర్ణులయ్యారని గురువారం జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఫలితాల్లో శ్రీకాకుళం టెన్త్ 17వ స్థానం, ఇంటర్మీడియట్‌లో 23వ స్థానంలో నిలిచిందని వారు వెల్లడించారు.

News April 25, 2024

JEE మెయిన్స్‌లో వాడపాలెం విద్యార్థికి జాతీయ RANK

image

JEE మెయిన్స్ పరీక్షల్లో డా.బీఆర్.అంబేడ్కర్ జిల్లా కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన బండారు సాయి నరేన్‌ జాతీయ స్థాయి ఓపెన్ క్యాటగిరిలో 648వ ర్యాంక్ సాధించారు. నరేన్ తండ్రి బండారు శ్రీనివాసరావు గంటి జడ్పీ హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ మేరకు విద్యార్థిని గ్రామస్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 25, 2024

CTR: రైలు ఢీకొని ముగ్గురి మృతి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు… రామసముద్రం మండలం పట్రాజుపల్లికి చెందిన లోకేశ్, గంజిగానిపల్లికి చెందిన సుబ్బు, శశికుమార్ బెంగుళూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: 3వ సెమిస్టర్ ఫలితాల విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం యూనివర్సిటీ డీఎన్ విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా డిగ్రీ మొదటి, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కొద్ది రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

News April 25, 2024

29న ఓటర్ల తుది జాబితా విడుదల: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 29వ తేదీ ఓటర్లతో తుది జాబితా విడుదల చేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 29న చిహ్నాలను కేటాయిస్తామన్నారు. బాపట్ల జిల్లాలో మొత్తం 147 నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు.

News April 25, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూం పరిశీలన

image

నూతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని గురువారం పరిశీలించారు. కంట్రోల్ రూంలో మీడియా సర్టిఫికేషన్ మోనిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ పలు శాఖలను ఆయన పరిశీలించారు.

News April 25, 2024

రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

image

రాజంపేట ప్రజాగళం సభలో TDP అధినేత చంద్రబాబు రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చారు. ‘రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం. అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడం. మాచుపల్లి బ్రిడ్జీ, ఓబిలి-టంగుటూరు బ్రిడ్జీని పూర్తి చేయడం. జర్రికోట ప్రాజెక్ట్ నుంచి సుండుపల్లికి తాగునీరు, సాగునీరు ఇవ్వడం. గాలేరు, నగరి కాలువ పనులను పూర్తి చేయడం తమ బాధ్యత’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

image

ఎచ్చెర్లలోని చిలకపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మజ్జి అచ్చెప్పడు మృతి చెందాడు. పొందూరులోని లోలుగు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. ఆటోను వెనుక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి ఆయనను తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

పోలింగ్ శాతం పెరిగేందుకుకు చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నామని నెల్లూరు కలెక్టర్‌ హరి నారాయణన్‌ వివరించారు. స్థానిక ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వ్యయ పరిశీలకులు, సాధారణ పరిశీలకులతో కలెక్టర్‌, ఎస్పీ సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో 79శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి 85 శాతానికి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News April 25, 2024

నరసరావుపేట: ఎలక్షన్ అబ్జర్వర్‌ను కలిసిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్‌గా బూరె సర్వేశ్వరుడు నరేంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ లోతేటి అబ్జర్వర్‌ను కలిశారు. అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.