Andhra Pradesh

News April 25, 2024

అనంత: వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి ఆస్తి రూ.లక్షే

image

శింగనమల వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు తన నామినేషన్ అఫిడవిట్‌కు సంబంధించి చరాస్తుల విలువ రూ.1,06,195గా పేర్కొన్నారు. అలాగే తనపై ఎటువంటి స్థిరాస్తులు, అప్పులు లేనట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. 2014లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.

News April 25, 2024

ఇవే నా చివరి ఎన్నికలు: మండలి బుద్ధప్రసాద్

image

ఇవే తన చివరి ఎన్నికలని అవనిగడ్డ జనసేన MLA అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం దింటిమెరకలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే నాలుగేళ్లుగా బీడుగా ఉన్న 4వేల ఎకరాలను సాగు భూమిగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తీర ప్రాంత గ్రామాల పరిరక్షణ కోసం కరకట్ట మరమ్మతులు వేయించి తాగు, సాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు.

News April 25, 2024

పంగులూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

పంగులూరు మండలం కొండ మంజులూరు పాలకేంద్రం వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పవరంకి చెందిన కిషోర్, అద్దంకికి చెందిన చందు, ముండ్లమూరుకి చెందిన ప్రవీణ్ లు ద్విచక్ర వాహనంపై ముప్పవరం వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో వాహనం చెడిపోవడంతో దానిని టోల్ ప్లాజా వద్ద ఉంచారు. అనంతరం నడిచి వెళుతున్న వారిని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 25, 2024

పిఠాపురంలో పవన్‌‌పై పోటీకి 10 మంది నామినేషన్

image

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి సంబంధించి ఇప్పటివరకూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు మొత్తం 11 మంది అభ్యర్థులు, 19 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గురువారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుందని తెలిపారు.

News April 25, 2024

కావలి: సచివాలయ ఉద్యోగి సస్పెండ్

image

కావలి పట్టణం బుడంగుంటలోని 15వ వార్డు సచివాలయ అడ్మిన్ పెంచల బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం బుడంగుంట సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. సచివాలయ తాళాలు ఉండే సదరు ఉద్యోగిని ఇందుకు బాధ్యుడిగా చేస్తూ సస్పెండ్ చేశారు. విచారణ ముగిసి తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఇది కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.

News April 25, 2024

విజయనగరంలో వ్యక్తి మృతి

image

విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని ఎస్.కోట వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గురువారం ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈరోజు తెల్లవారు జామున రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తి చేశారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News April 25, 2024

కైలాసగిరిపై మరో రెండు రోజుల్లో రైలు సిద్ధం

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖ నగరం కైలాసగిరిపై సర్కులర్ రైలు మరో రెండు రోజుల్లో సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు విఎంఆర్డిఏ అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ నెల నుంచి సర్కులర్ రైలు బాధ్యతలు విఎంఆర్డిఏ తీసుకుని నిర్వహిస్తుందన్నారు. అయితే సాంకేతిక సమస్యలు రావడంతో వార్షిక నిర్వహణకు వేరే ఏజెన్సీకి అప్పగించామన్నారు. మరమ్మతులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు.

News April 25, 2024

వేముల: రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

image

అనంతపురానికి చెందిన శ్రీనివాసులు కుటుంబంతో కలిసి బుధవారం కారులో కడపకు బయలుదేరారు. వేముల మండలంలోని గొందిపల్లె సమీపంలో టీవీఎస్ వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి పక్కనున్న పొలాల్లో పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రద్ధ (14) అనే బాలిక మృతిచెందింది.

News April 25, 2024

బాపట్ల: ‘26 లోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండి’

image

ఎన్నికల విధులకు నియమించబడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు బాపట్ల అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సర్వీసులు కింద పని చేస్తున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12డీలను ఏప్రిల్ 26 లోగా రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు.

News April 25, 2024

తిరుపతి: 200 మంది అభ్యర్థులు నామినేషన్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ (గురువారం) నేటితో ముగియనుంది. ఇప్పటివరకు పార్లమెంట్ స్థానానికి 25మంది అభ్యర్థులు, శాసనసభ స్థానాలకు 175 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరి రోజు ఎక్కువ మంది నామినేషన్ వేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లు జిల్లా వ్యాప్తంగా RO కార్యాలయాల వద్ద మరింత భద్రతను పెంచారు.