India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రక్షణ శాఖ మంత్రి విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి గాజువాక పోలీస్ స్టేషన్లో ఉంచారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోరాట కమిటీ సభ్యులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాజ్ నాథ్ సింగ్ పర్యటనకు వీరు అడ్డు పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 43 మంది నామినేషన్లు వేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి ఆరుగురు, మడకశిర నుంచి 10 మంది, హిందూపురం నుంచి నలుగురు, పెనుకొండ నుంచి ఐదుగురు, పుట్టపర్తి నుంచి ఏడుగురు, ధర్మవరం నుంచి 8 మంది, కదిరి నుంచి ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని పేర్కొన్నారు.
నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడును ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు ఏపీసీసీ అధ్యక్షురాలు YS.షర్మిల బుధవారం బీఫాం అందజేశారు. కాగా ఆయన రేపు నామినేషన్ వేయనున్నట్లు మీడియాకు తెలిపారు.
ఆధ్యాత్మిక పట్టణంగా పేరుగాంచిన పిఠాపురం ఓటర్లు ఎన్నికల్లో విభిన్న తీర్పుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగగా 1989 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏఒక్క అభ్యర్థీ 2వసారి గెలిచిన దాఖలాలు లేవు. అయితే రానున్న ఎన్నికల్లో కొత్తగా పొటీచేస్తున్న పవన్ గెలుస్తారా లేదా సెంటిమెంట్కు భిన్నంగా 2009లో విజయం సాధించిన వంగా గీతకు మరోసారి పట్టంకడతారా అనేది ఆసక్తిగా మారింది. – మీ కామెంట్..?
కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా విధులు నిర్వహించాలని
సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని తుక్కులూరు గ్రామానికి చెందిన వివాహితపై భర్త బుధవారం కర్రతో దాడి చేశాడు. గ్రామానికి చెందిన పండు, బాధితురాలు ఝాన్సీతో ఏడు సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. తన భర్త మద్యం మత్తులో తనపై పలుమార్లు దాడి చేసినట్లుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కంభం మండలంలోని ఎర్రబాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆటోలోని నాగయ్య(60) మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తంబళ్లపల్లె MLA సీటుపై సస్పెన్స్ వీడింది. టీడీపీ అభ్యర్థి జయచంద్రా రెడ్డికే బీపాం అందింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆయన కలిసి బీఫామ్ అందుకున్నారు. మొదటి లిస్టులోనే జయచంద్రా రెడ్డిని TDP అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తంబళ్లపల్లె, అనపర్తి టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సీటు బీజేపీకి ఇస్తారని, టీడీపీలోనే అభ్యర్థిని మార్చుతారని ఇన్ని రోజులు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ బుధవారం మాడుగుల స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వైసీపీ తరఫున అక్క ఈర్లె అనురాధ నామినేషన్ వేసిన విషయం తెలిసిదే. నామినేషన్ అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించేందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. తన నామినేషన్ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చునని పోలీస్ అబ్జర్వర్ అశోక్ టి.దుధే ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా పోలీసు పరిశీలకులుగా ఆయన నియమితులయ్యారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లోని గెస్ట్ హౌస్లో ఆయన అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో 7569618685, policeobserver73@gmail.com ద్వారా ఆయన్ను సంప్రదించవచ్చు.
Sorry, no posts matched your criteria.