India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 26వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఫారం-12 దరఖాస్తుకు ఎన్నికల గుర్తింపు కార్డు ఎన్నికల విధుల నియామక పత్రం జతచేసి నోడల్ అధికారి ద్వారా వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సూచించారు.
☞ అభ్యర్థి: వంగా గీత (వైసీపీ)
☞ విద్యార్హతలు: బి.ఎ, బి.ఎల్, ఎం.ఎల్
☞ కేసులు: ఏమీ లేవు
☞ చరాస్తులు: రూ.2.10 కోట్లు, భర్త పేరు మీద రూ.27.81 లక్షలు
☞స్థిరాస్తులు: రూ.13.11 కోట్లు, భర్త పేరు మీద రూ.13.64 కోట్లు
☞ అప్పులు: రూ.4.51 కోట్లు, భర్త పేరు మీద రూ.51.64 లక్షలు
➤ నియోజకవర్గం: బొబ్బిలి
➤ అభ్యర్థి: బేబినాయన
➤ పార్టీ: టీడీపీ
➤ విద్యార్హత: డిగ్రీ
➤ చరాస్తులు: రూ.3,19,53,154
➤ స్థిరాస్తులు: రూ.1,00,51,100
➤ భార్య పేరిట చరాస్తులు: రూ.71,99,116
➤ భార్య పేరిట స్థిరాస్తులు: రూ.33,77,500
➤ అప్పులు: రూ.5.70కోట్లు(బ్యాంకుల్లో)
➤ కేసులు: 1
నందికొట్కూరు ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ బాష కూతురు షేక్ రోషిని టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. పరిక్షల ఫలితాల్లో 600కు గాను 596 మార్కులు సాధించి తన ప్రతిభ కనబరిచింది. తన కుతూరు ఈ మార్కులు సాధించడం గర్వకారణమని కుటుంబ సభ్యుడు రఫీ అహ్మద్ ప్రకటనలో తెలిపారు.
మాడుగుల అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తన చేతిలో రూ.50 వేల నగదు, బ్యాంకు డిపాజిట్లు రూ.7.69 లక్షలు, భూముల విలువ రూ.21.17 కోట్లు, భార్య పేరున రూ.5.81 కోట్ల ఆస్తులు, కారు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023లో సీఎం జగన్ను దూషించినందుకు, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పినగాడిలో అధికారులను అడ్డుకున్నందుకు, 2009లో సబ్బవరం పీఎస్లో మరో కేసు ఉన్నట్లు పేర్కొన్నారు.
అనంతపురం నగరానికి చెందిన టి.ప్రణతి సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాలలో 598 మార్కులతో సత్తా చాటి రాష్ట్ర టాపర్లలో ఒకరిగా నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడమే తన లక్ష్యమన్నారు. ఆమెను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చుట్టాలు అభినందించారు.
కనిగిరి పట్టణానికి చెందిన షేక్ అల్తాఫ్, షేక్ అసిఫ్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. పట్టణంలోని ఓ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములు 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించారు. ఒకేసారి జన్మించిన ఈ ఇద్దరూ ఒకే మార్కులతో పాస్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరిని స్కూల్ యాజమాన్యంతోపాటు పలువురు అభినందించారు.
ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించింది. తాడికొండ(ఎస్సీ) నియోజకవర్గానికి చిలకా విజయ్ కుమార్ స్థానంలో మణిచల సుశీల్ రాజా పేరును ఖరారు చేసింది. రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు, తెనాలి – ఎస్కే బషీద్ , గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి డాక్టర్. రాచకొండ జాన్ బాబు పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.
➤ నియోజకవర్గం: కమలాపురం
➤ అభ్యర్థి: పి. రవీంద్రనాథ్ రెడ్డి
➤ చరాస్తి విలువ: రూ.21,66,41,321
➤ స్థిరాస్తి విలువ: రూ.14,07,41,368
➤ అప్పులు: రూ.20,02,58,264
➤ కేసులు: 3
NOTE: అఫిడవిట్లోని వివరాల ప్రకారం.. దంపతులు ఇద్దరికి కలిపి ఉన్న ఆస్తి వివరాలు
నెల్లూరు జిల్లాలో నామినేషన్లు ఊపందుకున్నాయి. నాలుగో రోజు సోమవారం ఒక్కరోజే దాదాపు 30 నామినేషన్లను స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్లో ఆదాల, సిటీలో నారాయణ, సర్వేపల్లిలో కాకాణి, ఆత్మకూరులో ఆనం, ఉదయగిరిలో కాకర్ల సురేశ్ నామినేషన్లు దాఖలు చేశారు.
Sorry, no posts matched your criteria.