India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి పరీక్షల ఫలితాలలో కొత్తచెరువు మండలంలో వనం గాయత్రి అనే విద్యార్థిని 589 మార్కులు సాధించింది. బాలిక బుక్కపట్నం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రామంజి కుమార్తె. గాయత్రి మండల కేంద్రమైన కొత్తచెరువులో చదువుతోంది.
నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం పెద అమిరంలోని NTR విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ చేరుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందిస్తారని కూటమి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లాలోని అనంతసాగరం, మనుబోలు, కావలి రూరల్, కందుకూరు రూరల్, సంతపేట తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ప్రజలు భయాన్ని వీడి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.
పి.గన్నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ఖరారు చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన చిట్టిబాబుకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ నుంచి MLA అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.
దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామనికి చెందిన త్రివేణి గవర్నమెంట్ స్కూల్లో చదివి టెన్త్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని తండ్రి నాగేశ్ ఆటో నడుపుతున్నాడు. పదో తరగతి ఫలితాలలో 600 మార్కులకుగాను 593 మార్కులు సాధించింది.
వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా సోమవారం శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
సింగరాయకొండ బస్టాండ్లో సోమవారం భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో బస్టాండు సెంటర్లోని లగేజీ సెంటర్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ప్రయాణికుడి వద్ద రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డక్కిలి మండల పరిధిలోని దగ్గవోలు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 35 మందికి 35 మంది పాసయ్యారు. ఇందులో కే.శ్రావ్య 600 మార్కులు గాను 519 మార్కులు సాధించి పాఠశాలలో మొదట స్థానంలో నిలిచారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు 100% ఉత్తీర్ణత రావడం సంతోషం అని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు నామినేషన్ వేసేందుకు సోమవారం భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రఘురామను పార్టీ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించాయి. అనంతరం పెద అమిరం గ్రామంలోని RRR నివాసం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ర్యాలీగా వచ్చారు. ఉండి తహశీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు.
Sorry, no posts matched your criteria.