Andhra Pradesh

News April 22, 2024

శ్రీకాకుళం: 28,982 మంది విద్యార్థుల ఎదురుచూపులు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇటీవల మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28,982 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 1592 మంది పరీక్షలు రాశారు.. విద్యార్థుల్లో బాలురు 14,843 మంది ఉండగా, బాలికలు 14,139 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 145 పరీక్షా కేంద్రాలో పది పరీక్షలు నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

News April 22, 2024

తిరుపతి: రోడ్డు ప్రమాదంలో 10th క్లాస్ విద్యార్థి మృతి

image

పట్టణంలోని కొర్లగుంటకు చెందిన మురుగేశ్ కుమారుడు చరణ్ (15) ఇటీవలే పది పరీక్షలు రాశాడు. ఇంటి నుంచి స్కూటీ తీసుకుని బయటకు వచ్చాడు. సుబ్బారెడ్డి నగర్ వద్దనున్న శ్రీనివాస సేతుపై వందడుగుల దూరం వెళ్లగానే అదుపుతప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడే పడిపోయాడు. స్థానికులు గుర్తించి 108 లో రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 22, 2024

ఒంటిమిట్ట: వాహనాల దారి మళ్లింపు వివరాలు

image

సోమవారం ఒంటిమిట్టలో శ్రీరాముని కళ్యాణం సందర్భంగా అధికారులు వాహనాల దారి మళ్లింపు వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు రాయచోటి మీదుగా, తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రేణిగుంట నుంచి దారి మళ్లించామన్నారు. రాజంపేట వైపు నుంచి వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా, రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ మీదగా వెళ్లాలన్నారు.

News April 22, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు YCP,TDP ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ నుంచి రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి మనోహర్ నాయుడు, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత ఉన్నారు. ప్రత్తిపాడు టీడీపీ నుంచి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, తూర్పు మహ్మద్ నజీర్, గురజాల యరపతినేని శ్రీనివాసురావు, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు నామినేషన్ వేయనున్నారు.

News April 22, 2024

తీవ్ర ఉత్కంఠ.. తూ.గో జిల్లాలో 30,116 మంది

image

‘పది’ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
☞ తూ.గో జిల్లాలో 137 కేంద్రాల్లో 30,116 మంది పరీక్షలు రాశారు. కాగా.. గతేడాది ఈ జిల్లా రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది.
☞ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 21,113 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఈ జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
☞ కాకినాడ జిల్లాలో 27,712 మంది పరీక్షలు రాయగా.. గతేడాది ఈ జిల్లా 19వ స్థానంలో నిలిచింది.

News April 22, 2024

ఒంగోలు MP మాగుంట కుటుంబంలో విషాదం

image

ఒంగోలులో దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి కుమారుడు విజయ్ రెడ్డి (విజయ్ బాబు) సోమవారం ఉదయం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయనకు పలు అనారోగ్య సమస్యలుండటంతో ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందించినా ఉపయోగం లేకపోయింది. ఒంగోలు నుంచి MPలుగా ఆయన తల్లిదండ్రులు సుబ్బరామరెడ్డి, పార్వతమ్మ ఇద్దరూ గెలిచారు. ప్రస్తుతం మృతుని బాబాయ్ శ్రీనివాసులరెడ్డి TDP తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు.

News April 22, 2024

గుంటూరు: నేడు నామినేషన్లు వేసే YCP అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన , ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి కే మనోహర్ నాయుడు, తాడికొండ నుంచిమేకతోటి సుచరిత వైసీపీ నుంచి నామినేషన్ వేయనున్నారు.

News April 22, 2024

ప.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు నామినేషన్లు వేసే అభ్యర్థులు వీరే.
☞ ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్.
☞ నరసాపురం BJP ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
☞ దెందులూరు- చింతమనేని ప్రభాకర్ (TDP).
☞ చింతలపూడి- సొంగా రోషన్ కుమార్ (TDP).
☞ ఉండి- రఘురామకృష్ణరాజు (TDP).
☞ నరసాపురం- బొమ్మిడి నాయకర్ (JSP).
☞ కైకలూరు- దూలం నాగేశ్వరరావు (YCP).

News April 22, 2024

తిరుపతి: అనుమానంతో భార్య గొంతు నులిమి హత్య

image

భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన వరదయ్యపాళెంలో జరిగింది. మండలంలోని సాధనవారిపాళెంనకు చెందిన అంజలి(23)కి తూకివాకంకు చెందిన రాజశేఖర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 5 నెలలకే భర్త అనుమానంతో వేధిస్తుండడంతో అంజలి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో19వ తేదీన అత్తవారింటికెళ్లి అక్రమసంబంధం ఉందంటూ భార్యతో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమై ఆవేశంతో రాజశేఖర్ తన భార్య గొంతు నులమడంతో మృతి చెందింది.

News April 22, 2024

కమలాపురంలో TDP అభ్యర్థి మార్పు?

image

కమలాపురంలో TDP అభ్యర్థిని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పుత్తా నరసింహారెడ్డికి కాకుండా కుమారుడు చైతన్యరెడ్డికి అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఆదివారం చంద్రబాబు జిల్లా నేతలకు బీఫారాలు ఇవ్వగా ఇందులో చైతన్య చంద్రబాబు వద్ద కమలాపురం సీటు తన తండ్రికి ఇస్తే బాగుంటుందని, దాని వలన చేకూరే లబ్ధిని వివరించారు. పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.