Andhra Pradesh

News September 20, 2024

రాఘవేంద్రస్వామి సన్నిధిలో హీరో పూరీ ఆకాష్

image

మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాష్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం సహాయక పీఆర్‌ఓ హొన్నొళ్లి వ్యాసరాజాచార్, పురోహితులు కుర్డీ శ్రీపాదాచార్ స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠంలో జరిగిన రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు.

News September 20, 2024

శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News September 20, 2024

నెల్లూరు: హెడ్ కానిస్టేబుల్ మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. నాగరాజు వెంకటగిరిలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో గురువారం చనిపోయారని ఆయన కుటుంబీకులు తెలిపారు. వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ సుబ్బారావు మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

News September 20, 2024

ప్రకాశం జిల్లాలో నేడు CM పర్యటన

image

ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం మద్దిరాలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పాలన పూర్తయిన సందర్భంగా.. ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్యం 2 గంటలకు మద్దిపాడు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్‌లో పాల్గొంటారు. అధికారులు పర్యటనా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News September 20, 2024

నేటి నుంచి మంత్రి ఆనం నెల్లూరు జిల్లా పర్యటన

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 20న చేజర్ల మండలం మాముడూరు, 21 సంగం మండలం జండాదిబ్బ, 22న ఏఎస్పేట హస్నాపురం, 23న ఆత్మకూరు మున్సిపాలిటీ పేరారెడ్డిపల్లి, 24న అనంతసాగరం, లింగంగుంట, 25న మర్రిపాడు, తిక్కవరం, 26న ఆత్మకూరు, చెర్లో ఎడవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు.

News September 20, 2024

స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారికి యాక్షన్ ప్లాన్: కలెక్టర్

image

స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో జిల్లాలోని వృద్ధి కారకాలను (గ్రోత్ ఇంజన్లను) గుర్తించి విజన్ యాక్షన్ ప్లాన్-2047ను అక్టోబర్ 15 లోపు తయారు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారీపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News September 20, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్ తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో బైక్‌లు వాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా హెల్మెట్లను వినియోగించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

News September 20, 2024

వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్

image

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

News September 20, 2024

శ్రీకాకుళం: పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మాజీ స్పీకర్ సీతారాం

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి MP సెగ్మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఆమదాలవలస మాజీ MLA తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్లు YCP అధినేత జగన్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో, MLAలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి పదవులు కేటాయించినట్లు సమాచారం.

News September 20, 2024

అండర్‌–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలను గురువారం తణుకు మహిళా కళాశాలలో నిర్వహించారు. టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, యోగా, త్రోబాల్, చదరంగం, టెన్నికాయిట్‌ విభాగాల్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జూనియర్‌ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ భూపతిరాజు హిమబిందు అభినందించారు.