Andhra Pradesh

News April 21, 2024

శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు భీపామ్‌లు అందించిన చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలో శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థులకు భీపామ్‌లు అందించారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ (శ్రీకాకుళం), గౌతు శీరిష (పలాస), బెందాళం అశోక్(ఇచ్ఛాపురం), కూన రవికుమార్(ఆమదాలవలస), అచ్చెన్నాయుడు (టెక్కలి), మామిడి గోవిందరావు(పాతపట్నం), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట) భీపామ్‌లు అందుకున్నారు.

News April 21, 2024

ఉండి టీడీపీ కంచుకోట.. గెలిచి తీరుతా: RRR

image

ఉండిలో ఎంతమంది అడ్డొచ్చినా MLAగా గెలిచి తీరుతానని రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతులమీదుగా ఉండి అభ్యర్థిగా బీఫాం అందుకున్న రఘురామ.. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. ఉండిలో మంతెన రామరాజుతో కలిసి ముందుకు సాగుతానని అన్నారు. ఉండి టీడీపీ కంచుకోట అని, టీడీపీ-జనసేన్-బీజేపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లి జెండా ఎగురవేస్తానని అన్నారు.

News April 21, 2024

కాకినాడ: ఎన్నికల ప్రచారంలో నేతకు గాయాలు

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. రాష్ట్ర నేత కంటే వీరరాఘవరావు తీవ్ర గాయాలకు గురయ్యారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దొరబాబు శనివారం రాత్రి సామర్లకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. బాణాసంచా పేల్చుతూ, తారాజువ్వలు వేశారు. కంటే వీరరాఘవరావు తలపై ఒక తారాజువ్వ పడటంతో అతడికి గాయాలయ్యాయి. నాయకులు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News April 21, 2024

బైకులు నడిపే వారికి ప్రకాశం జిల్లా ఎస్పీ హెచ్చరికలు

image

బైకులకు విపరీతమైన శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 118 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడితే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.

News April 21, 2024

టీడీపీ MP, MLA అభ్యర్థులకు బీఫామ్ అందించిన చంద్రబాబు

image

గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఆదివారం బీ-ఫామ్‌లను అందచేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్, గుంటూరు తూర్పు-మొహమ్మద్ నజీర్, గుంటూరు పశ్చిమ-గళ్లా మాధవి, ప్రత్తిపాడు-బూర్ల రామాంజనేయులు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్లు బీ ఫామ్‌లను అందుకున్నారు.

News April 21, 2024

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పొడగింపు: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈనెల 26 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పనిచేసే చోట ఫారం -12 దరఖాస్తు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఫారం -12కు దరఖాస్తు చేసుకున్నా వారందరు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.

News April 21, 2024

తిరుపతి: ఆ రోజు కార్మికులకు సెలవు

image

ఎన్నికలు జరిగే మే 13న ఉద్యోగ, ఉపాధి, కార్మికులకు సెలవు రోజని కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ బాలు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం- 1988 ప్రకారం ఎన్నికల రోజున వేతనాలతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అర్హుడైన ఓటరుకు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించి సెలవు జారీ చేయకపోతే జరిమానాతో కూడిన శిక్షార్హులని చెప్పారు.

News April 21, 2024

రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: రాయచోటి
➤ అభ్యర్థి: మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (టీడీపీ)
➤విద్యార్హత: ఇంటర్
➤ చరాస్తి విలువ: రూ.24,62,176
భార్య పేరిట: రూ.42,761
➤ స్తిరాస్తి విలువ: రూ.3,17,85,000
భార్య పేరిట: 1,70,000
➤ ఇతర ఆస్తుల విలువ:
➤ అప్పులు: లేవు
భార్య పేరిట: రూ.14,67,000
➤ బంగారం: 238.56 గ్రాములు

News April 21, 2024

చిత్తూరు: పోస్టల్ బ్యాలెట్ గడువు పెంపు

image

పోస్టల్ బ్యాలెట్ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఫారం-12ను పూర్తి చేసి.. హెచ్ఓడీల ద్వారా కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. ఇందుకోసం ఈనెల 22 వరకు ఉన్న గడువును 23కు పెంచినట్టు చెప్పారు.

News April 21, 2024

పాలకొండ: రహదారి ప్రమాదంలో వివాహిత మృతి

image

పాలకొండ డివిజన్ కేంద్రంలో పురటాల పోలమ్మ ఆలయం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వీరఘట్టం మండలం విక్రమ్‌పురం గ్రామానికి చెందిన వివాహిత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాలకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.